logo

ఇంటికి 200 మీటర్ల దూరంలో ఎదురైన మృత్యువు

గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తి ప్రాణాలు బలి తీసుకుంది. అదీ.. సదరు వ్యక్తి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే. ఈ ఘటన ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై ఉమ కథనం ప్రకారం.. గుడిమల్కాపూర్‌లోని

Published : 19 Jan 2022 04:18 IST


కిషోర్‌ కుమార్‌

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తి ప్రాణాలు బలి తీసుకుంది. అదీ.. సదరు వ్యక్తి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే. ఈ ఘటన ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై ఉమ కథనం ప్రకారం.. గుడిమల్కాపూర్‌లోని బాలాజీనగర్‌, ప్రణాగ్‌ హైట్స్‌ నివాసి ఆకుల కిషోర్‌ కుమార్‌(55) మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు జియాగూడలోని దుకాణం మూసేసి, తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్నారు. గుడిమల్కాపూర్‌ రిటైల్‌ కూరగాయల మార్కెట్‌ గేటుకు ఎదురుగా ఆయన బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన కిషోర్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి కిశోర్‌ ఇంటికి దాదాపు 200 మీటర్ల దూరమే ఉంటుంది. రెండు నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వ్యక్తి ఎప్పటికీ ఇంటికి రానంత దూరం వెళ్లారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని