logo

జిల్లాలో 252 మందికి వైరస్‌

జిల్లాలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో 953 మందికి బుధవారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 252 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లా ఆసుపత్రి, ఆయా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు

Published : 20 Jan 2022 01:46 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో 953 మందికి బుధవారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 252 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లా ఆసుపత్రి, ఆయా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కొనసాగుతున్న టీకా ప్రక్రియ: జిల్లాలో బుధవారం 15 నుంచి 18 మధ్య వయసున్న 794 మందికి టీకా వేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ఆసుపత్రిలో ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు. 18 ఎళ్లపైన ఉన్న వారికి మొదటి డోసు 691 మందికి, రెండో డోసు 8866 మందికి వేశామని పేర్కొన్నారు. మందు జాగ్రత్త టీకాలు 151 మందికి ఇచ్చామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని