సంక్షిప్త వార్తలు
ఒమిక్రాన్ విజృంభన ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ నెలాఖరు వరకూ విద్యా సంస్థలు బంద్ ప్రకటించడంతో పాటు కోచింగ్ సెంటర్లు మూత పడడంతో నగరంలో సిటీ బస్సు ప్రయాణాలు 20-30 శాతం తగ్గాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఆర్టీసీని వీడని కరోనా కష్టాలు
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ విజృంభన ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ నెలాఖరు వరకూ విద్యా సంస్థలు బంద్ ప్రకటించడంతో పాటు కోచింగ్ సెంటర్లు మూత పడడంతో నగరంలో సిటీ బస్సు ప్రయాణాలు 20-30 శాతం తగ్గాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలోనూ ప్రయాణికులు గణనీయంగా తగ్గారు. పస్తుతం కొన్ని సంస్థలు ఇంటి నుంచే పని చేసుకోడానికి అనుమతి ఇవ్వడంతో ప్రైవేటు వాహనాల రాకపోకలు తగ్గాయి. ఆటోలు, క్యాబ్లు కూడా డిసెంబరు నాటి పరిస్థితిని అంచనా వేస్తే సగానికి సగం తగ్గినట్టు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో సిటీ బస్సులు పూర్తి స్థాయిలో నడపడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలోనే బూస్టర్ డోస్కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: ములుగు జిల్లా వెంకటాపురం కర్రిగుట్టల ఎన్కౌంటర్లో గాయపడిన గ్రేహౌండ్స్ జవాను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం తీవ్రంగా గాయపడిన జవాను మధును హుటాహుటిన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. తూటా ఆయన కుడి చేయిని చీల్చుకుంటూ ఛాతీలోకి వెళ్లినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం ఆయన ఛాతీలో ఉన్న బుల్లెట్ను తొలగించేందుకు శస్త్ర చికిత్స చేసినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వివరించాయి. మంగళవారం రాత్రి డీజీపీ మహేందర్రెడ్డి జవానును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. ఆయనతోపాటు ఐజీ ప్రభాకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్కుమార్ ఉన్నారు.
పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్కు యాప్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: పెంపుడు జంతువుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ వెల్లడించారు. వచ్చే నెలలో దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బుధవారం ట్వీట్ చేశారు. యాప్లో యజమాని ప్రాథమిక వివరాలు నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ సులభంగా పూర్తి చేయొచ్చని తెలిపారు. నోయిడాలో పెంపుడు జంతువుల్ని తప్పనిసరిగా ‘పెట్ రిజిస్ట్రేషన్ యాప్లో’ నమోదు చేయాలి అని ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్ను అర్వింద్కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కాచిగూడ, న్యూస్టుడే: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆసరా లేని పేద బ్రాహ్మణులకు ఉచిత వసతి, భోజనం కల్పించనున్నట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్, బ్రాహ్మణ సంక్షేమ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ తెలిపారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారికి అవసరమైన వస్తువులు, వైద్య సేవలు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఈ నెల 25 లోపు వాట్సప్ నంబరు: 97016 09689 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జిల్లా న్యాయస్థానంలో కంట్రోల్ రూం ఏర్పాటు
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్టుడే: రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన భవన సముదాయంలో ఆన్లైన్లోనే కేసులు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయవాదుల సౌకర్యార్థం నూతనంగా కంట్రోల్రూం ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయస్థానం ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఆర్.తిరుపతి ఆదేశాల మేరకు అధికారులు బుధవారం న్యాయ సేవా సదన్లో కంట్రోల్ రూంను అందుబాటులోకి తెచ్చారు. న్యాయవాదులకు ఇంటి వద్ద అంతర్జాల ఇబ్బందులు ఎదురైతే.. ఇక్కడకొస్తే కోర్టుతో అనుసంధానం చేసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు అవకాశం కల్పిస్తారు. స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తోటపల్లి భాస్కర్రెడ్డి, రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు ఎ.అనంతసేనారెడ్డి కంట్రోల్ రూం పనితీరు పరిశీలించి, న్యాయమూర్తి తిరుపతికి ధన్యవాదాలు తెలిపారు.
20, 21 తేదీల్లో అంతర్జాలం వేదికగా చిత్ర కళాఖండాల వేలం
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: రెండు రోజులపాటు అంతర్జాలం వేదికగా చిత్ర కళాకృతుల వేలం నిర్వహించనున్నట్లు బంజారాహిల్స్లోని డిరివాజ్ అండ్ ఐవ్స్ సంస్థ స్పష్టం చేసింది. ఈనెల 21, 22 తేదీల్లో ఈ వేలం కొనసాగుతుందన్నారు. కొవిడ్ నేపథ్యంలో కళాకారులను ఆదుకునేందుకు, వారి ప్రతిభను చాటిచెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. జామినీరాయ్, ఎన్.ఎస్.బింద్రే, ఎస్హెచ్ రజా, ఎఫ్ఎన్.సౌజా, ఎంఎఫ్.హుస్సేన్, వీఎస్.గైతోండే, జహంగీర్ సబావాలా, అక్బర్ పదంసి, ప్రభాకర్ బర్వే, గణేష్ తదితర ప్రముఖ చిత్రకారులకు చెందిన 30కిపైగా అపురూప చిత్రా కళాఖండాలను అంతర్జాలం వేదికగా బిడ్డింగ్ ద్వారా కళాపోషకులు ఎంపిక చేసుకోవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి