మీసంమెలేస్తున్న మోసం!
రూ.4,336 కోట్లు.. మహా నగరం అడ్డాగా గతేడాది ఆర్థిక నేరగాళ్లు సామాన్యుల నుంచి కాజేసిన సొమ్ము. ఇది కేవలం పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిర్ధారించిన సొత్తు మాత్రమే. మాయగాళ్ల చేతిలో పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకోలేని బాధితులు వేలల్లో ఉంటారని అంచనా.
మహా నగరిలో కొత్త తరహా ఆర్థిక నేరాలు
గ్రేటర్లో రూ.వేల కోట్ల స్వాహా
రూ.4,336 కోట్లు.. మహా నగరం అడ్డాగా గతేడాది ఆర్థిక నేరగాళ్లు సామాన్యుల నుంచి కాజేసిన సొమ్ము. ఇది కేవలం పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిర్ధారించిన సొత్తు మాత్రమే. మాయగాళ్ల చేతిలో పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకోలేని బాధితులు వేలల్లో ఉంటారని అంచనా. కొద్దిపాటి పెట్టుబడితో అధిక లాభాలు, తక్కువ ధరకు విలువైన స్థలాలు, నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు.. ప్రతి అవకాశాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. చొక్కా నలగకుండా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలనే ఆశతో మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు. 2020లో రూ.500 కోట్ల మేర ఆర్థిక నేరాలు జరిగితే.. 2021నాటికి అది 10 రెట్లు పెరగటం పరిస్థితికి అద్దంపడుతోంది. సైబర్ నేరస్థులకు పోటీగా వైట్కాలర్ నేరగాళ్లు పెరగటం ఆందోళన చెందాల్సిన అంశమేనంటున్నారు పోలీసు అధికారులు.
ఎంతకైనా బరితెగింపు
ఉన్నత చదువులు.. సమాజంలో గౌరవం. మంచిచెడుల విచక్షణ తెలిసిన విద్యావంతులే ఆర్థిక నేరస్థులుగా మారుతున్నారు. అప్పులు చేసి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. అక్కడ నమ్మకం కుదిరాక భూములు, విలువైన ఆస్తులున్నాయంటూ ఫోర్జరీ సంతకాలతో నకిలీపత్రాలు సృష్టించి తనఖా ఉంచుతున్నారు. బ్యాంకర్లు చివరికి మోసపోయినట్టు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రీ లాంచింగ్ పేరిట.. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే మధ్య తరగతి ఆశలే అవకాశంగా అందమైన ప్రకటనలతో నిండా ముంచుతున్నారు కొందరు. సొంత స్థలాల్లేకుండానే ఇళ్లు కడుతున్నామంటూ రూ.కోట్లు రాబడుతున్నారు. నకిలీ పత్రాలతోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్ అంతా బోగస్ అని తెలిసినా చాలా మంది ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి మోసపోతూనే ఉంటున్నారు.
దొరికితేనే దొంగలు
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలే అవకాశంగా మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా సుమారు 1500-1800 ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.300 నుంచి స్థోమతకు తగినట్టుగా పెట్టుబడితో రాబడి ఇస్తామంటూ దేశ, విదేశీ సంస్థల పేర్లతో నేరస్థులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ముసుగులో దిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాలు కేంద్రంగా భారీఎత్తున మోసాలు జరుగుతున్నాయని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
కొన్ని ఉదాహరణలు
ప్రముఖ వ్యాపార సంస్థకు ముగ్గురు డైరెక్టర్లు. ఇద్దరికి చెక్ పవర్ ఉంది. మరో డైరెక్టర్ రోజూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటాడు. ఖాతాదారులు కావడంతో ఆ బ్యాంకు మేనేజర్ కూడా చెక్లో రాసినంత నగదు ఇస్తుండేవారు. అసలు సంగతి ఏమిటంటే బ్యాంకు చెక్పై ఫోర్జరీ సంతకంతో మూడో వ్యక్తి ఏకంగా రూ.25లక్షలు కాజేశాడు. అంతర్గత ఆడిటింగ్లో విషయం బయటపడి పోలీసుల వరకు చేరింది.
* భవన నిర్మాణ సంస్థలు, బ్యాంకు రెండింటినీ ఏకకాలంలో మోసం చేసిన నలుగురిపై కేసు నమోదైంది. వీరంతా సమాజంలో గుర్తింపు ఉన్నవారు. విద్యావంతులు. వ్యాపార ముసుగులో జాతీయ బ్యాంకుకు నకిలీపత్రాలు అందజేసి రూ.53 కోట్లు రుణం పొందారు. వీరు తనఖా ఉంచిన పత్రాలపై ఫోర్జరీ సంతకాలను గుర్తించి బ్యాంకు మేనేజర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
* ఇందూస్ వివ సంస్థ ఉత్పత్తులను అంటగడుతూ దేశవ్యాప్తంగా 9.5లక్షల మందిని మోసగించి రూ.1500కోట్లు కాజేసింది. ఈ మాయాజాలంలో 25 మంది భాగస్వామ్యం ఉన్నట్టు పోలీసులు దర్యాప్తులో నిర్దారించారు. బ్యాంకులోని రూ.20కోట్ల నగదు ఫ్రీజ్ చేశారు.
ముందుచూపుతో మాయగాళ్లకు చెక్
-దార కవిత, డీసీపీ, ఆర్థిక నేరాల విభాగం, సైబరాబాద్
ఎవరికీ డబ్బులు ఊరకే రావని గుర్తించాలి. కొంత పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయనే ప్రకటనలు బోగస్ అని తెలుసుకోవాలి. పోస్టాఫీసు, జాతీయ బ్యాంకులు కూడా ఇవ్వలేని వడ్డీ బయటి సంస్థలు ఎలా ఇస్తాయనేది ఒక్కసారి ఆలోచించండి. ఖాతాదారులపై నమ్మకంతో బ్యాంకులు కూడా మోసగాళ్ల చేతిలో రూ.కోట్లు నష్టపోతున్నాయి. కాయకష్టం చేసి సంపాదించిన సొమ్మును పెట్టుబడి/ఇంటి నిర్మాణం/ఆస్తి కొనుగోలుకు వెచ్చించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. సంస్థలు చెబుతున్న మాటలు, చూపుతున్న పత్రాలు అసలా/నకిలీవా నిర్దారించుకోవాలి. మల్టీలెవల్ మార్కెటింగ్, పెట్టుబడులు, ప్రీలాంచింగ్ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వచ్చినా, మోసపోయినట్టు గ్రహించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు