logo

ఆర్థిక ఇబ్బందులకు రైతు బలి

సాగులో వచ్చిన నష్టం, చేసిన అప్పులు తీర్చడమెలాగో తెలియడం లేదని ఆందోళన చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చేర్యాల మండలం రాంపూర్‌లో చోటు చేసుకుంది.

Published : 21 Jan 2022 01:05 IST

చేర్యాల, న్యూస్‌టుడే: సాగులో వచ్చిన నష్టం, చేసిన అప్పులు తీర్చడమెలాగో తెలియడం లేదని ఆందోళన చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చేర్యాల మండలం రాంపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలు... మండలంలోని రాంపూర్‌కు చెందిన ఇరుముల్ల బీరయ్య (44) బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యానికి సిద్దిపేటకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. తనకున్న 1.20 ఎకరం భూమిలో నిరుడు పత్తి సాగు చేయగా నష్టం వచ్చింది. ఇప్పటికే మోయలేని అప్పు ఉండగా ఎలా తీర్చాలా అని బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉండగా భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని