ప్రత్యేక కార్యాచరణ.. రక్తహీనత నియంత్రణ
మహిళల్లో రక్తహీనతకు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక పోషకాలను అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆరోగ్యకరమైన అతివల సమాజాన్ని రూపొందించేందుకు కార్యాచరణ అమలులోకి రాబోతోంది. జాతీయ
గవర్నర్ చొరవతో పోషకాల కిట్కు సన్నాహాలు
కొనసాగుతున్న శిబిరాలు
బుద్ధారంలో పరీక్షలు చేస్తున్న సిబ్బంది
మహిళల్లో రక్తహీనతకు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక పోషకాలను అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆరోగ్యకరమైన అతివల సమాజాన్ని రూపొందించేందుకు కార్యాచరణ అమలులోకి రాబోతోంది. జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో అమలుకానున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై చొరవతో ఆర్థిక వనరులు సమకూరనున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మండలానికి ఒక గ్రామంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులను గుర్తించి కేసీఆర్ కిట్ తరహాలో ‘పోషకాల కిట్’ త్వరలో అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
జిల్లా వ్యాప్తంగా స్త్రీలు, పిల్లలు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని పూర్తి స్థాయిలో గుర్తించి అవసరమైన సహకారం అందించేందుకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అలాంటి వారికి పోషకాలను ఉచితంగా అందించాలని సంకల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తహీనత కలిగిన వారిని గుర్తించేందుకు భారత వైద్య పరిశోధన (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), జాతీయ పోషకాల సంస్థ (నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్)కు సూచించింది. ఈ సంస్థలు 2011లో నిర్వహించిన సర్వే అధారంగా అత్యధికంగా రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు వికారాబాద్లో ఉన్నారని గుర్తించారు. దీంతో జిల్లాను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. తొమ్మిది ఏళ్ల నుంచి 48 ఏళ్ల వయసున్న వారికి పరీక్షలు చేసి హిమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేస్తున్నారు.
ఏఏ మండలాల్లో: తాండూరు మండలం కోటబాస్పల్లి, పూడూరు మండలం కండ్లపల్లి, మోమిన్పేట మండలం అమ్రాదికలాన్, వికారాబాద్ పీరంపల్లి, పరిగి మాదారం, కుల్కచర్ల అంతారం, దోమ బొంపల్లి, కోట్పల్లి రాంపూర్, ధారూరు ధర్మాపూర్, పెద్దేముల్ బుద్ధారంలో శిబిరాలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 250 మందిని పరిశీలిస్తే 157మందిలో పదకొండు శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ అంతకంటె తక్కువ ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగిలిన మండలాల్లోని గ్రామాల్లోనూ చేపడితే ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
శాశ్వత పరిష్కారానికి..
బాలికలు, యువతులు, మహిళల్లో ఈ సమస్యలకు కారణాలను సైతం అన్వేషించనున్నారు. పరీక్షల ప్రకారం పేరు, బరువు, ఎత్తు, ఆధార్, చరవాణి సంఖ్య వంటి వివరాలను నమోదు చేయనున్నారు. దీంతోపాటు గ్రామాల్లోని బోరు నీరు, భగీరథ జలాలు, శుద్ధి నీటి ప్లాంటు నీటి నమూనాలను సైతం సేకరిస్తున్నారు. వాటిని ల్యాబ్కు తరలించి ప్రయోగాల అనంతరం కారణాలను తేల్చనున్నారు. ఆయా గ్రామాలకు రెండుమూడు నెలల తర్వాత వచ్చి ప్రయోగాల ఫలితాలతోపాటు గ్రామస్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాల గురించి అవగాహన కల్పించనున్నారు.
త్వరలో సరఫరా: జిల్లావ్యాప్తంగా శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక, ఆయా గ్రామాల వారీగా జాబితా రూపొందించి బాలికలు, యువతులు, మహిళలకు పోషకాలతోకూడిన కిట్ను ఉచితంగా అందించనున్నారు. 25 రోజులకు ఒకసారి అందించే కిట్లో బాదాం, పిస్తా, సేంద్రియంగా తయారు చేసిన రాగి లడ్డూలు, బెల్లంతో చేసిన పల్లీపట్టీలు వంటివి ఇవ్వనున్నారు.
వివరాలు నమోదు చేస్తున్నాం: ప్రవీణ్కుమార్యాదవ్, జాతీయ పోషకాల సంస్థ ప్రతినిధి
గవర్నర్ చొరవతో రక్తహీనత కల్గిన వారిని గుర్తించి ప్రత్యేకంగా పోషకాల కిట్ను త్వరలో సరఫరా చేస్తాం. మండలానికి ఒక గ్రామంలో శిబిరం నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఈ సమస్యను అధిగమించడం ద్వారా బాలికలు, యువతులు, మహిళల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం