కలహమా.. సర్దిచెప్పుమా!
పెద్ద చదువులు, ఉన్నత కొలువులు, అత్తమామల వేధింపులు లేవు, ఆర్థిక ఇబ్బందులు మచ్చుకైనా కనిపించవు.. కానీ ఆలుమగల మధ్య నిత్యం కలహాలు.. కలసి ఉండటం మా వల్ల కాదంటూ పోలీస్స్టేషన్లకు
చిన్నచిన్న కారణాలకే విడిపోతున్న ఆలుమగలు
ఏటా 4000 ఫిర్యాదులు
సైబరాబాద్లో ఐటీ కారిడార్దే అగ్రస్థానం
* మాదాపూర్ ఐటీ కంపెనీల్లో ఇద్దరూ సహోద్యోగులు. రెండేళ్లపాటు సహజీవనం చేశారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 6 నెలలకే కలసి ఉండలేమనే అభిప్రాయానికి వచ్చారు. ఇద్దరూ కలసి ఉన్నపుడు బోర్ కొడుతుందనేది వారి సమాధానం.
* పెళ్లయి మూడు నెలలు.. కుటుంబాలకు దూరంగా ఖరీదైన ఫ్లాట్లో నివాసం. కొత్త దంపతులు కదా! అని తల్లిదండ్రులు కూడా దూరంగా ఉన్నారు. ఇలాంటి భర్తతో కాపురం నా వల్ల కాదంటూ అమ్మాయి తేల్చి చెప్పింది.. కౌన్సెలింగ్లో ఆరాతీస్తే ‘ప్రేమతో ఇంటికొచ్చిన తన తండ్రి పట్ల భర్త దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.
పెద్ద చదువులు, ఉన్నత కొలువులు, అత్తమామల వేధింపులు లేవు, ఆర్థిక ఇబ్బందులు మచ్చుకైనా కనిపించవు.. కానీ ఆలుమగల మధ్య నిత్యం కలహాలు.. కలసి ఉండటం మా వల్ల కాదంటూ పోలీస్స్టేషన్లకు చేరుతున్నారు. సున్నిత మనస్కులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పిల్లలున్న దంపతులు మాత్రమే కౌన్సెలింగ్కు వస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో లక్షల సంపాదన.. మరోవైపు పొట్టకూటి కోసం కూలినాలీ చేసుకుంటూ బతుకెళ్లదీసే పేద కుటుంబాలున్నాయి. వీరిలో అధిక శాతం గొడవ పడి ఠాణా వద్దకు పంచాయితీకి చేరేది బాగా చదువుకున్న జంటలే అంటున్నారు పోలీసులు. సైబరాబాద్ పోలీసులకు డయల్ 100 ద్వారా రోజూ వచ్చే 750 ఫోన్కాల్స్లో 300 మహిళల వేధింపులకు సంబంధించినవే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
కారణాలు చిన్నవే
భార్యాభర్తల తగాదాల్లో ఇటువైపు నుంచి చూసినపుడు సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. మనోవేదన అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుందంటారు క్లినికల్ సైకాలజిస్టు ఆరె అనిత. గచ్చిబౌలి మహిళా పోలీస్స్టేషన్కు ఏటా 4,000కు పైగా ఫిర్యాదులు వస్తుంటాయని అంచనా. వీటిలో 70-80 శాతం ప్రైవేటు ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు, ఐటీ నిపుణులు ఉంటున్నారు. విడిపోవడానికి కారణాలు కూడా చిన్నవిగా కనిపిస్తున్నాయంటారు గచ్చిబౌలి మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్.బాలకృష్ణ. ‘మద్యం అలవాటు, వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులకు గురవుతున్న గృహిణులు భర్త నుంచి బయటపడాలని భావిస్తున్నారు. పిల్లల్ని కూడా తామే పోషిస్తామంటున్నారు. అంతటి కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఎంతోకాలంగా అనుభవిస్తున్న మనోవేదన కారణం’ అంటూ విశ్లేషించారు.
రోజుకు ఐదు ఫిర్యాదులు
భార్యాభర్తల తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రతిరోజు సగటున ఐదు వరకు అందుతున్నాయి. ఇందులో భార్యభర్తలిద్దరూ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసేవారివే ఎక్కువ. వివాహేతర సంబంధాలు హత్య/ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరు ఇతరులతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించడం ద్వారా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో ఆర్థిక సమస్యలు విభేదాలకు కారణమవుతున్నాయి. కొంతమంది భర్తలు వచ్చే సంపాదన తాగుడుకు ఖర్చు చేయడం ద్వారా ఆయా ఇళ్లలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
- కనకయ్య, ఇన్స్పెక్టర్, రాజేంద్రనగర్●
నచ్చిన జీతం, కోరుకున్న జీవితం ఉన్నప్పటికీ ఆలుమగలకు బంధాల విలువ తెలియకపోవటం, కుటుంబ విలువలపై అవగాహన లేకపోవటం వంటివి కారణాలుగా ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛతో ఒంటరిగా బతకవచ్చనే అభిప్రాయం వివాహ బంధాన్ని తేలికగా తీసుకునేందుకు కారణం. స్నేహితులు/ప్రేమికులుగా ఏళ్ల తరబడి తెలిసిన జంటల్లోనూ పెళ్లి తరువాత ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించటాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. పిల్లలకు సర్దిచెప్పాల్సిన పెద్దలు కూడా వారి నిర్ణయానికే వత్తాసు పలుకుతున్నారు. - అరే అనిత
- ఈనాడు, హైదరాబాద్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, న్యూస్టుడే
నాలుగేళ్ల వ్యవధిలో హత్యలు,ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు, అత్యాచారం, వేధింపులతో నమోదైన కేసులివీ..
సైబరాబాద్ పరిధిలో
2018 2,555
2019 2,830
2020 2,302
2021 2,500-2,550 (అంచనా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.