Hyderabad News: రూ.కోటి ఇస్తావా? నీ బిడ్డను చంపాలా?
సంపన్నుల పిల్లలను అపహరించి రూ.కోట్లు సంపాదించాలనుకున్న ముగ్గురు నిందితులను ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక
బాలిక అపహరణకు యత్నం.. ముగ్గురి అరెస్టు
ఈనాడు,హైదరాబాద్: సంపన్నుల పిల్లలను అపహరించి రూ.కోట్లు సంపాదించాలనుకున్న ముగ్గురు నిందితులను ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక పిస్తోలు, ఐదు తూటాలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను కొత్వాల్ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోయిన్పల్లిలో ఉంటున్న బల్క్డ్రగ్ ఫార్మాకంపెనీ నిర్వాహకుడు మనోజ్జైన్ కుమార్తె(16)ను అపహరించేందుకు ఈనెల 10న ముగ్గురు నిందితులు ప్రయత్నించి, విఫలమవడంతో పారిపోయారు. రూ.కోటి ఇవ్వకపోతే నీ కుమార్తెను చంపేస్తామంటూ ఇంటర్నెట్ ఫోన్ ద్వారా బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, కీలకాధారాలు లభించడంతో నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నామని కొత్వాల్ తెలిపారు.
మీది రాజస్థాన్.. మాదీ రాజస్థానే..
రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన జవారీలాల్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. బాచుపల్లిలో ఐరన్, హార్డ్వేర్ వ్యాపారం చేస్తున్నాడు. జవారీలాల్ తండ్రి రమేష్కు మనోజ్జైన్ తెలుసు. తన కుమారుడు జవారీలాల్ అక్కడే ఉన్నాడు.. మనం.. మనం రాజస్థాన్ వాళ్లం ఎప్పుడైనా నా కుమారుడితో మాట్లాడండి అనేవాడు. మనోజ్జైన్ జవారీలాల్కు ముఖపరిచయం లేకపోయినా తండ్రి ఫోన్లో చెప్పడంతో ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడన్న వివరాలు తెలుసు. వ్యాపారంలో సహకరించేందుకు జవారీలాల్ తన మేనల్లుడు విక్రమ్ను జోధ్పూర్ నుంచి రప్పించాడు. జవారీలాల్ పేకాట, ఇతర దుర్వ్యసనాలకు ఖర్చుపెడుతుండడంతో నష్టాలు మొదలయ్యాయి. వీటిని అధిగమించేందుకు సంపన్నుల పిల్లలను కిడ్నాప్చేయాలంటూ పథకం వేశాడు. మధ్యప్రదేశ్కు వెళ్లి రూ.30వేలతో దేశీ పిస్తోలు, తూటాలు కొనుక్కొచ్చాడు. జోధ్పూర్లో ఉంటున్న తన స్నేహితుడు మహేంద్రప్రతాప్ సింగ్ను హైదరాబాద్ రప్పించాడు.
రెక్కీ చేసి..మాస్కులు.. మంకీక్యాప్లు పెట్టుకుని
మనోజ్జైన్ ఇల్లు పరిసర ప్రాంతాలను తెలుకున్న జవారీలాల్ ఈనెల 8,9న రెక్కీ నిర్వహించాడు. ఈనెల 10న మనోజ్జైన్ కుమార్తెను అపహరించాలనుకున్నాడు. ముగ్గురూ కలిసి రెండుబైకుల్లో బోయిన్పల్లిలోని మనోజ్జైన్ ఇంటికి వెళ్లారు. వెళ్లేముందు ఎవరూ గుర్తుపట్టకుండా మాస్కులు, మంకీక్యాప్లు పెట్టుకున్నారు. బాలిక బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి బాలికను పట్టుకునేందుకు ప్రయత్నించారు. గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారు. కొద్దిసేపటికే ఇంటర్నెట్ ఫోన్ద్వారా మనోజ్జైన్కు ఫోన్చేసి రూ.కోటి ఇవ్వకపోతే మీ కుమార్తెను చంపేస్తామంటూ బెదిరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్, రేవంత్ డూప్ ఫైట్ చేస్తున్నారు: లక్ష్మణ్
[ 17-04-2024]
హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని భాజపా రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. -
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
[ 17-04-2024]
తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
జువెనైల్ హోం నుంచి తప్పించుకున్న పిల్లలు
[ 17-04-2024]
బాచుపల్లి జువైనల్ హోం నుంచి మంగళవారం కొంత మంది పిల్లలు తప్పించుకుని పారిపోయారు. జువైనల్ హోంలో మొత్తం 32 మంది పిల్లలు ఉన్నారు. -
సొంత బావని చంపిన బామ్మర్ది
[ 17-04-2024]
చేవెళ్ల మండల కేంద్రంలో కడమంచి నారాయణదాసు (45) అనే వ్యక్తిని హత్య చేశాడు. -
ప్రయాణికులు ఫుల్.. ఎంఎంటీఎస్లు నిల్
[ 17-04-2024]
ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్ ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉండగా.. ఇప్పుడు రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్లకు పరుగులు పెరిగినా.. కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. -
కంటోన్మెంట్ పోరు.. అభ్యర్థులు ఖరారు
[ 17-04-2024]
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. -
నాడు.. నేడు.. సాగరే ఆధారం
[ 17-04-2024]
నగరానికి తాగునీటి సమస్య లేకుండా జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తరలించడానికి ప్రణాళిక చేపడుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ వద్ద అత్యవసర పంపింగ్ స్టేషన్ నిర్మాణం షురూ చేసింది. -
నాడు అనుచరులు.. నేడు ప్రత్యర్థులు
[ 17-04-2024]
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ ఇద్దరూ ఒకప్పుడు పీజేఆర్ అనుచరులు. ప్రస్తుత నగర పరిధిలో ఎమ్మెల్యేలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి తలపడుతున్నారు. -
తప్పని గురి.. విజయతీరం చేరి
[ 17-04-2024]
సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం.. విభిన్నమైన ఆలోచనా విధానం.. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్వైపు అడుగులేశారు. -
మూడు ప్రమాదాలు.. 8 మంది మృతి
[ 17-04-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఆశ్రయమిచ్చిన ఇంటి¸నే దోచిన బాలిక
[ 17-04-2024]
ఇన్స్టాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసింది. చిలకలగూడ ఠాణాలో మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ ఆర్.గిరిధర్ వివరాలు వెల్లడించారు. -
రకుల్ తళుకుల్
[ 17-04-2024]
సినీనటి రకుల్ ప్రీత్సింగ్ మంగళవారం మాదాపూర్లో సందడి చేశారు. ఓ చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. -
రైల్వేస్టేషన్లలో మురుగు నీటి రీసైక్లింగ్..
[ 17-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ఉద్యానాలు ఎండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం నీరు తగినంత లేకపోవడమేనని సమాధానం వస్తుంది. -
అలలపై సాహసం.. అలుపెరగని పోరాటం
[ 17-04-2024]
‘అమ్మా నేను హుస్సేన్సాగర్లో సెయిలింగ్ నేర్చుకుంటానని కుమార్తె అడిగినప్పుడు.. తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూనే కాదనలేకపోయారు. -
మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
[ 17-04-2024]
మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది. -
మత్తు తలకెక్కి.. చదువు అటకెక్కించి..
[ 17-04-2024]
వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా నివసిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న మొరాకో దేశస్థుడు హెచ్న్యూ పోలీసులకు చిక్కాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ నిందితుడు.. డ్రగ్స్ పెడ్లర్లతో స్నేహం చేస్తున్నాడు. -
నిఘా పెట్టి.. ఆచూకీ కనిపెట్టి
[ 17-04-2024]
నలుగురు యువకులు ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జీడిమెట్ల నేరవిభాగం ఇన్స్పెక్టర్ విజయ్నాయక్ ప్రత్యేక నిఘా పెట్టి వారిని కటకటాల్లోకి పంపించారు. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
[ 17-04-2024]
నాటకరంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. -
ఏఐడీఎంకేను గెలిపించండి: అసదుద్దీన్
[ 17-04-2024]
దేశంలో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని.. అందుకు తమిళనాడులో పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నానని హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
ఒవైసీకి ఓటెందుకెయ్యాలో చెప్పాలి: రాజాసింగ్
[ 17-04-2024]
తమను చంపాలని చూస్తున్నారన్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. -
రూ.28 లక్షలు స్వాధీనం
[ 17-04-2024]
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు తనిఖీల్లో రూ.28,22,000 నగదు, రూ.2,37,702 విలువైన ఇతర వస్తువులు, 69.03 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. -
సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు
[ 17-04-2024]
‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు. -
జిల్లా సహాయ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
[ 17-04-2024]
వికారాబాద్ జిల్లా నూతన సహాయ కలెక్టర్గా ఉమా హారతి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. -
గనుల వ్యర్థాలు.. ఆదాయ నిక్షేపాలు
[ 17-04-2024]
జిల్లాలోని నాపరాళ్ల వ్యర్థాలను సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తే గనుల శాఖకు రూ.కోట్ల కొద్ది ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా కుప్పలు పేరుకుపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
-
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం