కాక్టెయిల్ పేరు చెప్పి.. పీల్చిపిప్పి!
రాజధానిలో కరోనా కేసులు భారీగా వస్తుండడంతో చిన్నా చితకా ఆసుపత్రులు మళ్లీ వసూళ్లకు తెరతీశాయి. అవసరం ఉన్నా లేకపోయినా మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ డోసుతోపాటు, మూడు డోసుల
మళ్లీ మొదలైన చిన్నాచితకా ఆసుపత్రుల దోపిడీ
అవసరం లేకున్నా మోనోక్లోనల్ యాంటీబాడీల డోసు
రాజధానిలో కరోనా కేసులు భారీగా వస్తుండడంతో చిన్నా చితకా ఆసుపత్రులు మళ్లీ వసూళ్లకు తెరతీశాయి. అవసరం ఉన్నా లేకపోయినా మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ డోసుతోపాటు, మూడు డోసుల రెమ్డెసివిర్ వేయాలంటూ దండుకుంటున్నాయి. పేరొందిన కొన్ని ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు బాధితుడి పరిస్థితి ఆధారంగా వీటిని సూచిస్తుండగా చిన్న ఆసుపత్రులు మాత్రం ఇదే అదనుగా భావిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజూ 2 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండగా ఒక్క బల్దియా పరిధిలోనే 1500కు తక్కువ కాకుండా వస్తున్నాయి. ఇందులో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఉంటున్నాయి. నమూనాలను జీనోమ్ స్వీకెన్సులో పరిశీలిస్తేనే ఏ వైరస్ అనేది స్పష్టమవుతుంది. ఇది ఖర్చుతో కూడినది కావడంతో ప్రభుత్వ స్థాయిలో చాలా తక్కువగానే చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుత కేసుల్లో ఏ వైరస్ అన్నది తేలడం లేదు. పేరొందిన ఆసుపత్రుల్లో చేరిన బాధితుల పరిస్థితిని బట్టి రెమ్డెసివిర్, కాక్టెయిల్ మందుల్లో ఏది ఇవ్వాలన్నదానిపై వైద్య బృందం స్పష్టత ఇస్తుంది. ప్రస్తుతం చాలా వరకు ఒమిక్రాన్ కేసులే ఉండడం వల్ల ముందుగా రెమ్డెసివిర్ మూడు డోసులు చేస్తున్నారు. మరికొన్ని కాక్టెయిల్ చేసి తగ్గగానే ఇంటికి పంపిస్తున్నాయి. చిన్నా చితకా వైద్యశాలలు సాధారణ వైద్యాన్ని పక్కనపెట్టి సరికొత్త ప్రచారాన్ని మొదలుపెట్టాయి. కాక్టెయిల్ డోసు చేయించుకుంటే ఒక్క రోజులోనే కోలుకోవచ్చని వాట్సాప్లతోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి.
ప్రస్తుతం తీవ్రత తక్కువ ఉన్నా..
నగరంలో ఇప్పుడు వస్తున్న కరోనా కేసుల్లో 80 శాతం మంది తక్కువ లక్షణాలున్న వారే. ప్రభుత్వం ఇస్తున్న ఔషధాలను వాడుతూ హోం ఐసొలేషన్లోనే చాలామంది కోలుకుంటున్నారు. అయినా కొన్ని చిన్న ఆసుపత్రులు ముందుగా కాక్టెయిల్ డోసు ఇచ్చి లక్షణాలు తగ్గకపోతే ఆ తరువాత ఒకట్రెండు రోజులకు రెమ్డెసివిర్ డోసులు చేస్తున్నాయి. విచిత్రంగా యువతకు రెండింటినీ చేస్తుండడం గమనార్హం.
ఒక సీసా.. ఇద్దరికి ఉపయోగం
ఒక సీసా మోనోక్లోనల్ యాంటీబాడీల కాక్టెయిల్ మందును ఇద్దరు బాధితులకు చేయొచ్ఛు సీసాకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు వసూలు చేయాల్సి ఉండగా, చిన్న ఆస్పత్రులు ఒక్క డోసుకే రూ.లక్ష పైన బిల్లు వేస్తుండడం గమనార్హం.
గ్రేటర్లో 1645 మందికి పాజిటివ్
ఈనాడు,హైదరాబాద్: గ్రేటర్లో గడిచిన 24 గంటల్లో 1645 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. అంతకుముందు రోజు 1474 మందిలో వైరస్ నిర్ధారణ అయింది. మేడ్చల్ జిల్లాలో 380 మంది, రంగారెడ్డిలో 336 మందికి వైరస్ సోకింది.
నేటి నుంచి జ్వరం సర్వే
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జీహెచ్ఎంసీ యంత్రాంగం శుక్రవారం నుంచి ఇంటింటా జ్వరం సర్వేకు సిద్ధమైంది. దోమల నివారణ విభాగం, పట్టణ సామాజికాభివృద్ధి విభాగంలోని పొదుపు సంఘాల మహిళలు, ఇతర సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ నర్సులు సర్వేలో పాల్గొననున్నారు. 500 సమూహాలను ఏర్పాటు చేసి, ఒక్కో సమూహానికి రోజుకు కనీసం 60 ఇళ్లను పరిశీలించాలని లక్ష్యం నిర్దేశించారు. కొవిడ్ బాధితులకు వైద్య సలహాలు ఇవ్వడంతోపాటు, ఔషధ సంచిని అందజేసి, ఉపయోగించే విధానాన్ని నర్సులు వివరిస్తారు. బస్తీల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో తొలుత అక్కడే సర్వే చేయనున్నారు.
‘కింగ్కోఠి’ ఆసుపత్రిలో కొవిడ్ వార్డు
దవాఖానాలోని వార్డులు శుభ్రం చేస్తున్న వైద్య సిబ్బంది
నారాయణగూడ, న్యూస్టుడే: కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు ‘వైద్య విధాన పరిషత్(కింగ్కోఠి) జిల్లా ఆసుపత్రి’లో కొవిడ్ సేవల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సిబ్బంది వార్డులను శుభ్రంగా చేశారు. మరోవైపు వైద్య సిబ్బంది ఆయా వార్డుల పరిస్థితులను పరిశీలించి.. సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి పరిష్కరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున్ స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా కింగ్కోఠి జిల్లా ఆసుపత్రిలోని 350 పడకలు ఆక్సిజన్తో అనుసంధానమై ఉన్నవే. ఈ క్రమంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడేవారికి అందించే ‘ఆక్సిజన్ ఫ్లోమీటర్లు’, ఐసీయు వార్డుల్లోని వెంటిలేటర్ల పనితీరునూ పరిశీలించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారినే ఈ ఆసుపత్రిలో చేర్చుకోనున్నారు. వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు కింగ్కోఠిలో ప్రసూతి సేవలు, ప్రసవాలను గురువారం నుంచి నిలిపివేశారు.
బస్తీలపై కొవిడ్ పంజా!
13-17 శాతం మందిలో నిర్ధారణ
10 ప్రాంతాల్లో ఎన్జీవో అధ్యయనం
బస్తీలు, మురికివాడలపై కరోనా పంజా విసురుతోంది. 13-17 శాతం మందిలో కరోనా నిర్ధారణ అవుతోంది. నగరానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. పాతబస్తీలో ఎక్కువ శాతం కేసులు వెలుగుచూస్తున్నాయి. హసన్నగర్, షహీన్నగర్, రాజేంద్రనగర్, ఎన్ఎస్కుంట పరిధిలోని పలు ప్రాంతాల్లో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేపట్టారు. మొత్తం 250 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 17 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 0-10 ఏళ్ల పిల్లలూ ఉన్నారు. చిన్నారులు 100-103 డిగ్రీల జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. పెద్దల్లో 99-101 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది.
అందరికీ అవసరం లేదు
- డాక్టర్ సుజీత్, జనరల్ ఫిజీషియన్, అపోలో ఆస్ప్రతి కన్సల్టెంట్
బాధితుడి పరిస్థితిని బట్టి కాక్టెయిల్/రెమ్డెసివిర్ అవసరాన్ని నిర్ణయించాలి. సాధారణ లక్షణాలున్నా, భయంతో ఆసుపత్రిలో చేరిన అందరికీ ఇవ్వడం సబబు కాదు. సాధారణ మందులతో తగ్గే అవకాశం ఉన్నా, కొందరు యువత వీటి కోసం ఒత్తిడి చేస్తున్నారు.
ఇలా చేయొచ్ఛు..
ఒమిక్రాన్: రెమ్డెసివిర్ మూడు డోసులు.
డెల్టా: పాజిటివ్ వచ్చిన మొదటి అయిదు రోజుల్లో మోనోక్లోనల్ యాంటీబాడీల కాక్టెయిల్ ఒక డోసు. వృద్ధాప్యంతోపాటు మధుమేహం, ఇతరత్రా రోగాలుంటే: అవసరం మేరకు రెండింటిని వేర్వేరుగా ఇవ్వొచ్ఛు.
చార్మినార్ జోన్లో ఉద్ధృతం
ఫీవర్ ఆసుపత్రిలో కరోనా పరీక్షకు బారులు తీరిన అనుమానితులు
కొవిడ్ వ్యాప్తి నగరంలో అంతకంతకు విస్తరిస్తోంది. రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గల్లీలు, బస్తీలు, కాలనీల్లో పాజిటివ్ కేసులు విస్తరిస్తున్నాయి. అదేస్థాయిలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం సిబ్బంది ఇంటింటికీ తిరిగి క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 50వేల ఇళ్లలో సంబంధిత ద్రావణాన్ని చల్లారు. సగటున రోజుకు వెయ్యికి పైగా ఇళ్లలో మందు చల్లుతున్నట్లు బల్దియా వెల్లడించింది. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. చార్మినార్ జోన్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. చాంద్రాయణగుట్ట సర్కిల్ పరిధిలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ జోన్, కూకట్పల్లి సర్కిల్ ఉన్నాయి.
* కొవిడ్ పాజిటివ్ కేసులు, లక్షణాలున్న ఇళ్లలో క్రిమిసంహారక ద్రావణం పిచికారీ కోసం జీహెచ్ఎంసీని సంప్రదించాల్సిన నంబరు.. 040 2111 1111
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం