Crime News: ముందుగా కారు చోరీ.. తర్వాత రెక్కీ.. ఆపై ఇళ్లలో దొంగతనం!
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్చేశారు. గతేడాది డిసెంబరు 3న రాత్రి ఎల్బీనగర్లోని హస్తినాపురం సంతోషిమాతా ఆలయంలో దొంగతనం జరిగింది. ఈ కేసులో ఐదుగురు సభ్యుల
స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న సీపీ మహేశ్ భగవత్
ఈనాడు, హైదరాబాద్: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్చేశారు. గతేడాది డిసెంబరు 3న రాత్రి ఎల్బీనగర్లోని హస్తినాపురం సంతోషిమాతా ఆలయంలో దొంగతనం జరిగింది. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాలోని పొన్నూరి చిన్నసత్యానందం(31), దారావత్ నవీన్(25), గండం సమ్మయ్య(24), జంగాల ప్రసాద్(27)ను అరెస్ట్ చేశారు. మండ్ల నాగేందర్ కోసం గాలిస్తున్నారు. శనివారం నేరెడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనరేట్లో అదనపు సీపీ జి.సుధీర్బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, నేరవిభాగ డీసీపీ పి.యాదగిరి, అదనపు డీసీపీ ఎం.శ్రీనివాసులు, ఏసీపీ పి.శ్రీధర్రెడ్డితో కలసి సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన పొన్నూరి చిన్నసత్యానందం అలియాస్ సతీష్ చిన్న దొంగతనాలతో మొదలై దోపిడీలు చేసేంతగా ఎదిగాడు. అతడిపై గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో 37 కేసులు నమోదయ్యాయి. గతంలో నాగార్జునసాగర్, దొనకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థి దారావత్తు నవీన్(నాగార్జునసాగర్), గండం సమ్మయ్య(గురజాల), జంగాల ప్రసాద్ (పిడుగురాళ్ల), మండ్ల నాగేందర్ వివిధరకాల నేరాలతో గురజాల జైలుకు చేరారు. అక్కడే వారికి చిన్న సత్యానందంతో పరిచయమై ముఠాగా మారారు.
కొట్టేసిన కారుతో ఏమార్చుతూ.. సూత్రదారి చిన్నసత్యానందం ముందుగా కారును దొంగతనం చేస్తాడు. ఆనక అదే కంపెనీ కారు, రంగు ఉన్న వాహనం నంబరు ప్లేట్ను ఆ కారుకు అమర్చుతాడు. పగటి వేళ దానిలో తిరుగుతూ తాళం వేసిన గృహాలు, ఖరీదైన ఆభరణాలున్న ఆలయాల వద్ద రెక్కీ చేస్తారు. చోరీకి బయల్దేరే ముందు సమ్మయ్య.. అడవిలో ఉంచిన కారును సత్యానందంకు అప్పగిస్తాడు. రాత్రివేళ ఐదుగురూ కలిసి ఆలయాలు, ఇళ్లలోకి ప్రవేశించి దోచుకున్నాక.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక దాన్ని పంచుకునేవారు. ఏడాది వ్యవధిలో పశ్చిమగోదావరి, గుంటూరు, విజయవాడ, ఎల్బీనగర్ ప్రాంతాల్లో 4 ఆలయాలు, బ్యాంకు, గృహ దొంగతనాలు 2, వాహనచోరీలు 3 చేశారు. ఏటీఎం కేంద్రాల లూటీకి సత్యానందం నల్గొండ జిల్లా పెదవూరలో గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్, హ్యాండ్కటింగ్ మెషీన్ దొంగిలించాడు. తమ ప్రణాళికను పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో బ్యాంకు వద్ద అమలుచేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం