బతికున్నా.. చంపేస్తున్నారు..!
మోమిన్పేట్ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు
తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో భూముల బదలాయింపు
తరచూ వెలుగులోకి...
పట్టించుకోని అధికారులు
ఈనాడు డిజిటల్, వికారాబాద్
* మోమిన్పేట్ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు 46, 49లలో 3 ఎకరాల భూమికి 2005 నుంచి 2014 వరకు నాలుగు దఫాలు రిజిస్ట్రేషన్ జరిగింది. కొంత కాలంగా మ్యుటేషన్ పెండింగ్లో ఉంది. సంబంధిత వ్యక్తులు తరచూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. అయితే ఇటీవల భూమికి సంబంధించి వారసులమంటూ ఓ మహిళ రావడం, గతంలో రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసి, బతికి ఉన్న వ్యక్తిని మృతి చెందినట్లు చూపించి, మా భూమిని అక్రమంగా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
* ధారూర్ మండలంలోనూ రెండు నెలల క్రితం ఇదే తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్కు చెందిన మహిళకు ధారూర్ మండలంలో వ్యవసాయ పొలం ఉంది. ఆమె ‘మృతి చెందింది’ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. తీరా విషయం బయటకు రావడంతో కొన్నాళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ తీసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. ఈయన విషయంలో కొంత మంది ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించారని సమాచారం.
సజీవంగా ఉన్నా.. వారు ‘చనిపోయారంటూ’ తప్పుడు మరణ ‘ధ్రువీకరణ’ పత్రాలను సృష్టించడం.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాం.. అది వాస్తవమే అంటూ నిర్ధరించం రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారిపోతోంది. అనంతరం సదరు వ్యక్తులకు చెందాల్సిన భూముల మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, పేరు మార్పిడి అయిన వెంటనే రూ.కోట్ల విలువైన భూములను అమ్ముకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమంగా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఉన్నతాధికారులు ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో జిల్లాలో మళ్లీమళ్లీ అదే తరహా సంఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.
లోపాలే ఆసరా... అంతా కుమ్మక్కు
జిల్లా కేంద్రమైన వికారాబాద్, మోమిన్పేట్, పూడూరు, పరిగి, నవాబుపేట్ మండలాల్లో భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరం కనీసం రూ.53 లక్షల నుంచి రూ.1.30 కోట్లు పలుకుతోంది. దీంతో రెవెన్యూ శాఖలో పనిచేసే కొంత మంది ఉన్నత, మధ్యస్థాయి సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి లోపాలను ఆసరాగా చేసుకుని పావులు కదుపుతున్నారు. తగాదాల్లో ఉన్నవి, కొన్నాళ్లుగా ఎవరూ పట్టించుకోని భూములను లక్ష్యంగా చేసుకుని, నకిలీ సంతకాలతో కొత్త ధ్రువ పత్రాలు సృష్టిస్తున్నారు. ధరణి పోర్టల్లో అంతా సరి చేస్తున్నారు. ఆనక అమ్మకానికి పెడుతున్నారు.
* వికారాబాద్ మండలం బూర్గుపల్లిలో రూ.5 కోట్ల విలువైన 7 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేసి, ఇతర ఉన్నతాధికారులు తప్పించుకున్నారు. ఇదే మండలంలో ఈ తరహా సంఘటనలో మరో మూడు వెలుగులోకి వచ్చాయి.
* పరిగి మండలంలో ప్రభుత్వం సాదాబైనామాలను నిలిపివేసిన తరువాత తహసీల్దార్ ఆన్లైన్ చేసి, వేరే వ్యక్తులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశారు. ఈ సందర్భంలోనూ ఉన్నతాధికారులు గుట్టుగానే వ్యవహరించారనే విమర్శలొచ్చాయి. చర్యల శూన్యం.
* పూడూరు మండలంలో 14 ఎకరాల దేవాదాయ భూములను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు, ఫోర్జరీ సంతకాలు చేసిన వ్యక్తులు దర్జాగా తిరుగుతున్నారు. మరెన్నో సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ విషయమై రెవెన్యూ విభాగంలోని ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పాలనాధికారి సైతం భూముల పేర్ల బదలాయింపులో జరుగుతున్న అక్రమాలపై పూర్తి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు