క్రైమ్ వార్తలు
టీవీ రిమోట్ విషయంలో భర్తతో గొడవ పడి ఓ మహిళ చెరువులో దూకి.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
టీవీ రిమోట్ విషయంలో దంపతుల మధ్య గొడవ
దౌల్తాబాద్, న్యూస్టుడే: టీవీ రిమోట్ విషయంలో భర్తతో గొడవ పడి ఓ మహిళ చెరువులో దూకి.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ(37) ఆదివారం మధ్యాహ్నం భర్త మల్లప్ప, ఇద్దరు కుమారులతో కలిసి ఇంట్లో టీవీ చూస్తుంది. ఆ సమయంలో టీవీ రిమోట్ గురించి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త ఆమెను మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో తండ్రి, కుమారులు అంతా ఒక్కటే నేను ఒక్కదాన్ని వేరే అని చెప్పి.. వంట చెరుకు కోసం పొలానికి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. గ్రామంలోని చెరువులో దూకింది. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా... ఫలితం లేకుండా పోయింది.
గడ్డపోతారంలో మహారాష్ట్ర వాసి..
గడ్డపోతారం (జిన్నారం), న్యూస్టుడే: జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో పనిచేసే మహారాష్ట్రకు చెందిన కార్మికుడు రాహుత్(25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఐడీఏ బొల్లారం పోలీసులు, గడ్డపోతారం గ్రామస్థుల కథనం ప్రకారం... పారిశ్రామిక వాడలోని ఓ రసాయన పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా పనిచేస్తున్న రాహుత్ 10 రోజులుగా విధులకు హాజరు కాకపోగా.. శనివారం మాత్రం పనులకు వెళ్లి తిరిగి గడ్డపోతారంలోని అద్దె ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామంలో తిరిగాడు. అతడితోపాటు గదిలో ఉండే మరో స్నేహితుడు మొదటి షిఫ్టుకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఉరేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
అక్కన్నపేట (హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్టుడే: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు పులి సురేశ్(35) దుర్మరణం చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్కూర్కు చెందిన సురేశ్ కొంతకాలంగా హుస్నాబాద్లో నివాసం ఉంటూ గ్రామంలో కూలీ పనులు చేస్తున్నాడు. ఇందుకోసం రోజూ హుస్నాబాద్ నుంచి కట్కూర్కు వచ్చి వెళ్తాడు. ఆదివారం కట్కూర్ నుంచి హుస్నాబాద్కు వెళ్తున్నాడు. అంతకపేట వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే సురేశ్ మృతి చెందాడు. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈ విషయమై ఎస్ఐ కొత్తపల్లి రవిని వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు అందలేదని వివరించారు.
శివ్వంపేటలో..
జోగిపేట, న్యూస్టుడే: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం పరిధిలోని శివ్వంపేట గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుర కార్మికుడు మృతిచెందినట్లు పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు.. చౌటకూరు మండలం సరాపల్లికి చెందిన ఎం.అర్జున్(35) సంగారెడ్డి పురపాలికలో పని చేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలోని శివ్వంపేట శివారులో డివైడర్ను ఢీకొనగా.. తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అర్జున్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు