హెచ్ఎండీఏలో.. అమ్మో.. అక్రమార్కులు!
మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు
అనుమతి లేని ఇళ్ల నుంచి పన్నుల వసూలు
భవనాల కూల్చివేతల్లో వెలుగులోకి వాస్తవాలు
4 జోన్ల పరిధిలో 40 మందిపై చర్యలకు సిద్ధం
దూలపల్లిలో అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్: మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీలు చేసి, అతిక్రమణలు లేకుంటే నివాసయోగ్య పత్రం జారీ చేస్తారు. అప్పుడే ఎంత పన్ను అనేది నిర్ణయిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నట్లు తేలింది. అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించగా, వాటికే పన్ను వసూలు చేయడం విస్తు గొలుపుతోంది. తాజాగా మేడ్చల్ జోన్లో చేపట్టిన కూల్చివేతల్లో ఈ తరహా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జోన్లోని నాలుగు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో ఇలాంటి భవనాలున్నట్లు తెలుస్తోంది. ఇతర జోన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరానికి పక్కనే ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 7 కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ భవనాలు వెలిశాయి. కొన్ని రోజులుగా హెచ్ఎండీఏ స్థానిక రెవెన్యూ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ సిబ్బందితో కలిపి వీటిని గుర్తించే పనిలో పడింది. ఇప్పటివరకు 600 చదరపు గజాలు ఆపై ఉన్న భవనాలను 200వరకు గుర్తించారు. ఇందులో 60కి పైగా భవనాలను సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు. జీప్లస్ 2 నిర్మాణాలకు సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు ఇస్తాయి. అంతకు మించితే హెచ్ఎండీఏలో దరఖాస్తు చేసుకోవాలి. చాలామంది జీప్లస్2కే అనుమతి తీసుకొని అయిదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. 600 గజాలు ఆపైన స్థలాల్లో అనుమతులు లేకుండా భారీ షెడ్లు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని విక్రయించి ప్రజలను మోసగిస్తున్నారు.
ఇంటి దొంగల హస్తంపై ఆరా
* హెచ్ఎండీఏ పరిధిలో మేడ్చల్, ఘట్కేసర్, శంకర్పల్లి, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. ఇక్కడి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళి విభాగాలు అవినీతి నిలయాలుగా మారాయనటానికి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలే నిరద్శనంగా నిలుస్తున్నాయి.
* ఈ నాలుగు జోన్ల పరిధిలో తొలి విడతలో 600 గజాలు ఆపైన అక్రమ నిర్మాణాలను 200 వరకు హెచ్ఎండీఏ గుర్తించింది. మరో 600 వరకు ఈ తరహా భవనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
* నగరాన్ని ఆనుకుని ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండటంతో స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకొని వెంచర్లు, నిర్మాణాలు చేపట్టాలంటే లేఅవుట్ రుసుంలు, అభివృద్ధి ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లించాలి. నిర్మాణాలు పూర్తయ్యే వరకు హెచ్ఎండీఏ వద్ద స్థలాలు, లేదా ఫ్లాట్లు తనఖా పెట్టాలి. కొందరు ఈ నిబంధనలు పాటించక కుండా అక్రమ పద్ధతులను ఎంచుకుంటున్నారు.
* నాలుగు జోన్లలో భారీగా అక్రమ భవనాలు రావడంలో స్థానిక పట్టణ ప్రణాళిక విభాగం హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. స్తిరాస్థి వ్యాపారులతో కొందరు సిబ్బంది కుమ్మక్కై వాటాలు తీసుకొని అక్రమ భవనాలను ప్రోత్సహిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది.
* మేడ్చల్లో తాజాగా పలు భవనాలకు అక్రమంగా ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య(పీటీఐఎన్)నెంబర్లు కేటాయించి ఆస్తి పన్నులు సైతం వసూలు చేస్తున్న వైనం ఓ ఉన్నతాధికారి దృష్టికి వచ్చింది. సంబంధిత ఉద్యోగిని పిలిచి ప్రశ్నించారు. ఆ భవనాలను ఉన్నతాధికారి సీజ్ చేయించారు.
* ఇలా నాలుగు జోన్ల పరిధిలో దాదాపు 40-50 పట్టణ ప్రణాళిక సిబ్బంది హస్తంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో భవనం నుంచి లక్షల్లోనే వసూలు చేసి పంచుకున్నారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
* క్షేత్రస్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు