logo

తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

బయట తిరగడం మానేసి, బుద్ధిగా చదువుకోవాలని తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది.

Published : 25 Jan 2022 02:07 IST

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: బయట తిరగడం మానేసి, బుద్ధిగా చదువుకోవాలని తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ కథనం ప్రకారం.. బోరబండ సమీపంలో నివసించే ఓ విద్యార్థి(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో చదువుకోవడం లేదని, మిత్రులతో బయట తిరుగుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు