అప్రమత్తతే రక్ష.. ఆదమరిస్తే శిక్ష
రోనా కేసులు పెరుగుతున్న వేళ.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని.. అందులోనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు వైరస్ బారిన పడితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు. కొద్ది రోజులుగా గాంధీ ఆస్పత్రి వైద్యులు చేసిన పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారు వైరస్ సోకినా మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోజుల్లోనే ఆక్సిజన్.. తరువాత వెంటిలేటర్ మీదకు తరలించాల్సి వస్తోందని చెబుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముప్పు అధికం
ఒమిక్రాన్ ఏమి చేయదనే భావన సరికాదు
గాంధీ వైద్యుల పరిశీలనలో వెల్లడి
కరోనా.. కర్ఫ్యూ!
గ్రేటర్లో గడిచిన 24 గంటల్లో 1,439 మంది కరోనా బారిన పడ్డారు.
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్
నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో పరీక్షలకు బారులు తీరిన జనం
కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని.. అందులోనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు వైరస్ బారిన పడితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు. కొద్ది రోజులుగా గాంధీ ఆస్పత్రి వైద్యులు చేసిన పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారు వైరస్ సోకినా మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోజుల్లోనే ఆక్సిజన్.. తరువాత వెంటిలేటర్ మీదకు తరలించాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు
మొదటి రెండు దశల్లో కరోనా విజృంభణ సమయంలో గ్రేటర్లో వైరస్ బారినపడిన అనేక మంది ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో పని చేయక రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోయింది. వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం చేసినా చాలా మంది ప్రాణాలు దక్కలేదు. మూడో దశలో ఒమిక్రాన్ కేసులే 90 శాతం ఉంటున్నాయి. ఒమిక్రాన్ బారిన పడినవారు వారంలోనే కోలుకుంటుండటంతో ముందు జాగ్రత్తలపై చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మాస్కు లేకుండా బయట తిరుగుతున్నారు. మొదట్లో ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉన్నా, వారం నుంచి ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. గాంధీ, టిమ్స్ ఆస్పత్రిలో 250 మంది వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు వెయ్యిమంది చికిత్స పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 167. పక్షం రోజులుగా చేరినవారిలో 78 మంది అప్పటికే వివిధ రోగాలతో బాధపడుతున్నారు. వీరిలో 74 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గాంధీ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. వీరిలో చాలా మందికి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వెంటిలేటర్ మీదకు పంపించాల్సి వస్తుందని చెబుతున్నారు. నెల నుంచి 400 మంది కరోనా చికిత్స కోసం గాంధీలో చేరారు. వివిధ రోగాలతో బాధపడేవారు వైరస్ బారినపడితే మాత్రం అది డెల్టా లేదా ఒమిక్రానైనా.. ఆరోగ్యం విషమిస్తోందని ఇక్కడి వైద్యుల పరిశీలనలో తేలింది. ఈ తరహా కేసులు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
సోమవారం నిర్మానుష్యంగా ఎన్టీఆర్ మార్గ్
ఫోను కొట్టు.. సంచార రైతు బజారు వచ్చేట్టు
ఒమిక్రాన్ వేరియంట్ అందరినీ కలవర పెడుతున్న వేళ.. సంచార రైతుబజార్ల సంఖ్యను పెంచడానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రంగం సిద్ధం చేసింది. కాలనీలకు నేరుగా కూరగాయలను తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోంది. దగ్గర్లోని రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ను సంప్రదిస్తే.. కాలనీలకు, గేటెడ్ కమ్యూనిటీలకు సంచార వాహనాల ద్వారా కూరగాయలు తీసుకు వస్తారని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పేర్కొంది. నగరలోని 11 రైతుబజార్ల పరిధిలో ఈ సేవలను వినియోగించుకోవాలని కోరింది.
వారంలో కోలుకుంటామన్న భావనే వద్దు
- డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి
ఒమిక్రాన్ బారినపడినా వారంలో బాగవుతామన్న ఉద్దేశంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు. ఆదివారం 65 మంది వస్తే 25 మందికి ఆక్సిజన్ అవసరం పడలేదు. చికిత్స అందించి ఇంటికి పంపించాం. మిగిలినవారు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అందుకే అందరూ మాస్కు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధులున్న వారు వైరస్ బారినపడితే వైద్యుల పర్యవేక్షణలో ఉంటేనే మేలు.
అశ్రద్ధ చేస్తే రీఇన్ఫెక్షన్కు అవకాశాలు ఎక్కువ
- డాక్టర్ బి.సుజీత్కుమార్, జనరల్ సర్జన్
కరోనా సోకి తగ్గాక అశ్రద్ధ కూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. తిరిగి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా సోకిన వ్యక్తులు 10-14 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. రీఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మాస్కు లేకుండా బయటికి రావొద్ధు బయట సమూహాల్లోకి వెళ్లకూడదు. వ్యాక్సిన్ రెండు డోసుల గడువు పూర్తయిన వ్యక్తులు.. బూస్టర్ డోసు వేసుకోవడం ఉత్తమం. రీఇన్ఫెక్షన్కు గురైతే సొంత వైద్యం వద్ధు. అంతకుముందు పారాసెట్మాల్ వేసుకుంటే తగ్గిపోయింది కదా.. అనుకుని సొంతంగా ముందులు వేసుకోరాదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధాలు వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్