సొంతింటి కల.. నెరవేరునులే..
పేదలకు రెండు పడక గదులను (డబుల్ బెడ్ రూం) నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులను ప్రారంభించింది. దీంతో పేద, దిగువ మధ్యతరగతి వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి.
వడివడిగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు
న్యూస్టుడే, పరిగి
పేదలకు రెండు పడక గదులను (డబుల్ బెడ్ రూం) నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులను ప్రారంభించింది. దీంతో పేద, దిగువ మధ్యతరగతి వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేది. ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేసి మిగతా కొంత మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి వచ్చేది. ఇది పేదలకు భారంగా మారుతుందని భావించిన ముఖ్యమంత్రి రెండు పడక గదులు, హాలు, వంటగదితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని శ్రీకారం చుట్టారు. పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా 510 ఇళ్లు కేటాయిస్తే వీటిలో సగానికి పైగా తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కల నెరవేరబోతోందని పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
అన్ని మండలాల్లోనూ..
రెండు పడక గదులను అన్ని మండలాల్లోనూ చేపడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 510 ఇళ్లకు రూ.26.95కోట్లు వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్ నిర్మాణానికి రూ.5.04లక్షలు కాగా పురపాలక సంఘం పరిధిలోని వారికి మాత్రం ఒక యూనిట్కు రూ.5.3లక్షలను కేటాయించారు. 560 చదరపు అడుగుల నిర్మాణంలో ఇంటి పనులు చేపడుతున్నారు.
* పరిగి పట్టణంలో విద్యారణ్యపురి ప్రాంతంలో 300 ఇళ్లు మంజూరయ్యాయి. ఐదు బ్లాకులు శ్లాబ్ స్థాయి వరకు పూర్తయ్యాయి. 120 ఇళ్లు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. * దోమ మండలానికి 50ఇళ్లు మంజూరు కాగా ఒక బ్లాక్ స్లాబ్ వరకు పూర్తిచేశారు. ఒక బ్లాకులో 24 ఇళ్లు ఉండేలా ఏర్పాటు చేశారు. * కుల్కచర్ల మండలానికి 80 గృహాలు మంజూరు కాగా ఇక్కడ స్థలం కొరత ప్రధాన సమస్యగా ఉంది. కొన్నేళ్లుగా మండల కేంద్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుబాటులో ప్రభుత్వ స్థలం లేకపోవడం, రెవెన్యూ అధికారులు ఇంజినీరింగ్ అధికారులకు స్థలం చూపకపోవడంతో నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. * ఇదే మండలంలోని అడవి వెంకటాపూర్లో 30ఇళ్లు ఇప్పటికే పూర్తిచేయగా ప్రారంభానికి ఎదురు చూస్తున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. * పూడూరు మండలానికి 50 చొప్పున మంజూరు కాగా నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి.
జూన్ వరకు పూర్తయ్యేలా కృషి : - వివేక్, జెఈఈ, రోడ్లు, భవనాల శాఖ
కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. కుల్కచర్లలో స్థలం కొరత మినహా మిగతా మండలాల్లో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వాస్తవానికి డిసెంబరు నాటికి పూర్తికావాల్సి ఉండగా జరిగిన జాప్యంతో ప్రభుత్వం కొంత గడువు ఇచ్చింది. నిర్ణీత సమయానికి అన్నిచోట్లా పూర్తిచేసేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి