Dharmapuri Arvind: పక్కా ప్రణాళిక ప్రకారమే నాపై దాడి: ఎంపీ ధర్మపురి అర్వింద్
పక్కా ప్రణాళిక ప్రకారమే మంగళవారం తనపై దాడి జరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తనపై దాడిని ప్రగతిభవన్ వేదికగా..
హైదరాబాద్: పక్కా ప్రణాళిక ప్రకారమే మంగళవారం తనపై దాడి జరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తనపై దాడిని ప్రగతిభవన్ వేదికగా మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారని ఆయన ఆరోపించారు. రైతులెవరూ తనపై దాడి చేయలేదని.. వారికి అటువంటి మనస్తత్వం ఉండదన్నారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సుమారు 25 మంది.. స్థానికంగా ఉన్న కొంతమంది తెరాస నేతలతో కలిసి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
రాము అనే వ్యక్తి తనపై దాడి చేశాడని.. దాడి జరిగిన సమయంలో ఏ ఒక్క పోలీసు అధికారి కూడా తనను రక్షించే ప్రయత్నం చేయలేదని అర్వింద్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డితో రాము దిగిన ఫొటోలను మీడియా ముందు ఆయన ప్రదర్శించారు. తనపై జరిగిన దాడి విషయమై నిజామాబాద్ సీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేసినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీ, తెలంగాణ హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్