logo

కోట్‌పల్లి ప్రాజెక్టులో యువకుడి మృతి

కోట్‌పల్లి ప్రాజెక్టు నీట మునిగి యువకుడు మృతి చెందినట్లు ధారూరు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు. కోట్‌పల్లికి చెందిన చాకలి అశోక్‌ కుమారుడు అఖిలేష్‌ (20) మంగళవారం ఇంటినుంచి బయటికి వెళ్లి

Published : 27 Jan 2022 01:06 IST

ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు నీట మునిగి యువకుడు మృతి చెందినట్లు ధారూరు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు. కోట్‌పల్లికి చెందిన చాకలి అశోక్‌ కుమారుడు అఖిలేష్‌ (20) మంగళవారం ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీస్‌ స్టేషన్లో మిస్సింగ్‌ కేస్‌ నమోదైంది. బుధవారం ఉదయం ప్రాజెక్టు నీటిలో గుర్తు తెలియని యువకుడు మృతి చెంది పడి ఉండటాన్ని పడవ నిర్వాహకులు చూసి స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చాకలి అశోక్‌ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తమ కుమారుడిదే శవమని తేల్చారు. శవ పరీక్ష నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని