logo

సీఎం చొరవతోనే అభివృద్ధి: ఎమ్మెల్యే

కొడంగల్‌ అభివృద్ధిలో కీలక పాత్ర ముఖ్యమంత్రిదేనని, ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

Published : 27 Jan 2022 01:06 IST

మాట్లాడుతున్న నరేందర్‌రెడ్డి

కొడంగల్‌, న్యూస్‌టుడే: కొడంగల్‌ అభివృద్ధిలో కీలక పాత్ర ముఖ్యమంత్రిదేనని, ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017లోనే రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారన్నారు. 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనను, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని, జూపల్లి కృష్ణారావును కూర్చోబెట్టుకొని కొడంగల్‌ చాలా వెనకబడి పోయిందని, కావాల్సిన నిధులు పుష్కలంగా ఇస్తానని చెప్పారని తెలిపారు. అందుకు తగినట్లుగానే పంచాయతీ రాజ్‌ రోడ్లకు రూ.300 కోట్లు, ఆర్‌ అండ్‌ బి రోడ్లకు రూ.200 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చారన్నారు.ఎంపీపీ ముద్దప్ప, మున్సిపల్‌ ఛైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌యాదవ్‌, జెడ్పీటీసీ నాగరాణి పాల్గొన్నారు.

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా గ్రామాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు కొనసాగుతుందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుద్యాల- అల్లిఖాన్‌పల్లికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు మంజూరు కావటంతో బుధవారం అల్లిఖాన్‌పల్లిలో శంకుస్థాపన చేస్తూ అక్కడే జరిగిన సమావేశంలో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని