logo

కల్నల్‌ సంతోష్‌బాబుకు ఘన నివాళి

Published : 27 Jan 2022 02:49 IST

సంతోషికి జ్ఞాపిక అందజేస్తున్న ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎయిర్‌ కమడోర్‌ మహేశ్వర్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని ఎన్‌సీసీ డైరెక్టరేట్‌(ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘షహీదోన్‌ కో శత్‌ శత్‌ నమన్‌’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భరతమాత రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులను స్మరించుకోవడంతోపాటు వారి కుటుంబసభ్యులను గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. ఎన్‌సీసీ డైరెక్టరేట్‌(ఏపీ, తెలంగాణ), 16వ బిహార్‌ రెజిమెంట్‌ బెటాలియన్ల ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌, ఎయిర్‌ కమడోర్‌ పి.మహేశ్వర్‌ హాజరయ్యారు. సంతోష్‌బాబు సతీమణి బి.సంతోషికి జ్ఞాపికను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు