ఆ నలుగురు ఎక్కడ?
రాజధాని నగరంలో డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ స్మగ్లర్ టోనీ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకున్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
కొకైన్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట
రెండేళ్లుగా టోనీ నుంచి మాదకద్రవ్యాల కొనుగోలు
ఈనాడు, హైదరాబాద్
రాజధాని నగరంలో డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ స్మగ్లర్ టోనీ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకున్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టోనీ సహా పది మందిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఈ కేసులో గజేంద్రపారిఖ్, సోమాశశికాంత్, అలోక్జైన్, సంజయ్లకు సంబంధం ఉందని ఆధారాలు సేకరించారు. ఈ నలుగురిలో ఒకరు నగరంలోని ప్రముఖ వ్యాపారి కుమారుడని గుర్తించారు. వీరంతా రెండేళ్లుగా టోనీ నుంచి కొకైన్ను తీసుకుంటున్నారని సమాచారం. వీరితో పాటు డ్రగ్స్ తీసుకుంటున్న నిందితులను కొద్ది రోజుల ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో అప్రమత్తమైన గజేంద్రపారిఖ్, అలోక్జైన్, సంజయ్, సోమాశశికాంత్లు పారిపోయారు. అప్పటి నుంచి పోలీసులు వీరికోసం వేట కొనసాగిస్తున్నారు. వీరిలో ఇద్దరు నిందితులు బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్లోని కొన్ని పంచతార హోటళ్లు, పబ్బుల్లో పార్టీలు నిర్వహించి అందులో కొకైన్ను సరఫరా చేసేవారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
వినియోగమా? సరఫరానా??
మాదక ద్రవ్యాలను తరచూ తీసుకుంటున్న నిరంజన్ కుమార్ జైన్, అలోక్జైన్, అగర్వాల్, గజేంద్ర పారిఖ్లు తమ సొంతానికి డ్రగ్స్ వాడుతున్నారా? లేక టోనీ నుంచి కొకైన్ను కొనుగోలు చేసి హైదరాబాద్లో ఇంకా ఎవరికైనా విక్రయిస్తున్నారా?కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ అవసరమైనప్పుడు నిరంజన్, అగర్వాల్లు తమ డ్రైవర్లను ముంబయికి పంపించి టోనీ నుంచి కొకైన్ను తెప్పించేవారని, సొంత వినియోగానికైతే ఇంత కొకైన్ అవసరం లేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. రూ.వందల కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాలను నిర్వహిస్తున్న వీరంతా డ్రగ్స్కు ఎలా అలవాటు పడ్డారన్న కోణాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు రహస్యంగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడని, ముంబయి, దిల్లీల్లోని బుకీలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయగా.. నిందితులు బెయిల్ కోసం కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు అంశాలపై గురువారం నిర్ణయం వెలువడనుందని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో దిల్సుఖ్నగర్ నారాయణ విద్యార్థుల ప్రతిభ
[ 25-04-2024]
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో దిల్సుఖ్నగర్ నారాయణ డే డివిజన్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులతో సత్తా చాటారు. -
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?