logo

కరోనా బారిన 71 మంది

జిల్లా వ్యాప్తంగా 8 ఆసుపత్రుల్లో 447 మందికి గురువారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 71 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. ఆయా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు.

Published : 28 Jan 2022 02:37 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా 8 ఆసుపత్రుల్లో 447 మందికి గురువారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 71 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. ఆయా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు..586 మందికి టీకాలు: జిల్లాలో గురువారం 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న 586 మందికి కొవిడ్‌ టీకాలను వేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 22 ప్రాథమిక, నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రిలో ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు. 18 ఏళ్లపైన ఉన్న వారికి మొదటి డోసు 1111 మందికి, రెండో డోసు 3267 మందికి వేశామని, ముందు జాగ్రత్త టీకాలు 204 మందికి ఇచ్చామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని