logo

మద్యం మత్తులో కారుతో బీభత్సం

లాస వంతమైన కారును మద్యం మత్తులో వేగంగా నడిపి ఓ యువతి రహదారిపై బీభత్సం సృష్టించింది. ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. వాహనదారులు అప్రమత్తమై కారును ఆపి పోలీసులకు అప్పగించారు. ఈఘటన గురువారం శంషాబాద్‌లో చోటుచేసుకుంది.

Published : 28 Jan 2022 02:37 IST

కారును పట్టుకున్న స్థానికులు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: విలాస వంతమైన కారును మద్యం మత్తులో వేగంగా నడిపి ఓ యువతి రహదారిపై బీభత్సం సృష్టించింది. ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. వాహనదారులు అప్రమత్తమై కారును ఆపి పోలీసులకు అప్పగించారు. ఈఘటన గురువారం శంషాబాద్‌లో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేట్‌వాసి అమీర్‌ సోహెల్‌, యువతి(25) బెంజ్‌ కారులో శంషాబాద్‌ విమానాశ్రయం వచ్చారు. తిరుగు ప్రయాణంలో యువతి కారు నడుపుతుండగా శంషాబాద్‌ బస్టాండ్‌వద్దకు రాగానే అదుపు తప్పింది. ఇతర వాహనదారుల అప్రమత్తతతో ముప్పు తప్పింది. కారులో విదేశీ మద్యం సీసాలు ఉన్నాయి. యువతికి శ్వాస విశ్లేషణ పరీక్ష చేయగా 550 బీఏసీ నమోదైంది. పోలీసులు కేసు నమోదుచేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని