Covid Vaccine: టీకా వేసుకోకున్నా.. వేసుకున్నట్లు ధ్రువపత్రాలు
కొవిడ్ టీకా వేసుకోకున్నా.. వేయించుకున్నట్లు ధ్రువపత్రాలు తయారు చేసి, విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురిని కాలాపత్తర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
నలుగురిని అరెస్టు చేసిన కాలాపత్తర్ పోలీసులు
చార్మినార్, న్యూస్టుడే: కొవిడ్ టీకా వేసుకోకున్నా.. వేయించుకున్నట్లు ధ్రువపత్రాలు తయారు చేసి, విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురిని కాలాపత్తర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చరవాణులు, కొన్ని ధ్రుపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ సుదర్శన్, డీఐ విక్రమ్సింగ్తో కలిసి చార్మినార్ ఏసీపీ భిక్షంరెడ్డి వివరాలు వెల్లడించారు. కాలాపత్తర్లోని అలీబాగ్కు చెందిన మహ్మద్ సైఫ్(19) సరూర్నగర్లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే వారికి టీకా వేసుకున్నట్లు నిర్ధారణ పత్రాలు తప్పనిసరి కావడంతో.. ఆ అవకాశాన్ని అక్రమార్జనకు మార్గంగా మార్చుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మిత్రులు షరీఫ్ అలియాస్ సమీర్(22), మహ్మద్ అస్లం(21), మహ్మద్ ఫరీద్(22) ముఠాగా ఏర్పడ్డారు. ఆధార్కార్డు ఆధారంగా ధ్రువప్రతాలు సృష్టిస్తున్నారు. ఇలా వీరి నుంచి ఏడుగురు ధ్రువపత్రాలు పొందినట్లు కాలాపత్తర్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్సెక్టర్ సుదర్శన్, డీఐ విక్రమ్సింగ్ బృందం రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకొని, రిమాండ్కు తరలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?