logo

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి దుర్మరణం

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 29 Jan 2022 05:36 IST


సంఘటనా స్థలం..

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదరావులపల్లి గ్రామానికి చెందిన కృష్ణ (24), అంజిలు ద్విచక్రవాహనంపై గురువారం మొగుల్‌మడ్క గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మండలంలోని నాగసార్‌గేట్‌ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా అంజి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉదయం నడకకు వెళ్తున్న గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఘటనా స్థలాన్ని వెళ్లి వివరాలు సేకరించి ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని