Telangana News: తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్ ఎప్పుడంటే?
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు విద్యాశాఖ సెలవులు ఇవ్వగా.. కొన్ని రోజుల నుంచి పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యాసంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని.. ఈ నెల 31 నుంచి తెరుస్తారా? అని ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఆన్లైన్ ద్వారా చేపట్టిన విచారణకు హాజరైన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని చెప్పారు.
కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే కర్ఫ్యూ, తదితర ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలు తెరవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠశాలలను తెరిచేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర జనవరి 24 నుంచే స్కూళ్లను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల