CM KCR: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ

తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో తెరాస

Published : 29 Jan 2022 13:16 IST

హైదరాబాద్‌: తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఎంపీలతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ భేటీలో లోక్‌సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన, కేంద్రం నుంచి సాధించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు నివేదికలు అందజేయనున్నారు. కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని