తల్లిలాంటి ఆలన.. స్వయం పాలన
రాజధానిలో కొత్తగా నిర్మించనున్న మూడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిమ్స్ తరహాలో స్వయం పాలిత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మూడింటిలో రోగుల సహాయకులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ధర్మశాలలను నిర్మించాలని మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతా శిశు విభాగాలు ఉండనున్నాయి.
కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు విభాగాలు
హెలీప్యాడ్లు, నర్సింగ్ హాస్టళ్లు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
కొత్తపేటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టనున్న ప్రదేశం
రాజధానిలో కొత్తగా నిర్మించనున్న మూడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిమ్స్ తరహాలో స్వయం పాలిత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మూడింటిలో రోగుల సహాయకులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ధర్మశాలలను నిర్మించాలని మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతా శిశు విభాగాలు ఉండనున్నాయి. రూ.3600 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే ఈ వైద్యశాలల భవనాల నిర్మాణాలకు త్వరలోనే టెండర్లను పిల్చి పనులను అప్పగించడానికి ఆర్అండ్బీ కసరత్తు చేస్తోంది.
నగరంలో పేదలందరికీ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్బీనగర్ సమీపంలోని కొత్తపేటలో ఒకటి, అల్వాల్ వద్ద మరొకటి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి దగ్గర ఒకటి కలిపి మొత్తం మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఇప్పటికే సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మూడింటికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వెయ్యి పడకల చొప్పున మొత్తం 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి.
నూతన వైద్యశాలల్లో సౌకర్యాలివి
మాతా శిశు విభాగాలు: మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా మాతాశిశు విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక బ్లాక్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా భవన నిర్మాణల సమయంలోనే చర్యలు చేపడుతున్నారు. కనీసం వంద పడకలను అందుబాటులో ఉంచాలనుకుంటున్నారు.
ధర్శశాలలు: ప్రస్తుతం నగరంలోని ఏ ప్రభుత్వ దవాఖానాలోనూ రోగుల సహాయకులకు రాత్రుళ్లు ఉండటానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. రోడ్ల పక్కనో చెట్ల కిందో పడుకుంటున్నారు. కొత్త వైద్యశాలల్లో రోగుల సహాయకుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో డార్మిటరీలు, ప్రత్యేక గదులు, అత్యాధునిక క్యాంటీన్, భోజనశాల తదితర ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ భవనానికి ధర్మశాల అని పేరు పెట్టనున్నారు.
హెలీప్యాడ్లు: అత్యవసర వేళల్లో రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి రోగులను హైదరాబాద్కు ఆంబులెన్స్ల్లోనే తరలిస్తున్నారు. భవిష్యత్తులో హెలికాప్టర్లలో తరలించే పరిస్థితి వస్తే ఉపయోగపడటానికి వీలుగా మూడు కొత్త ఆస్పత్రుల్లో హెలిప్యాడ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.
నర్సింగ్ హాస్టళ్లు: మూడు చోట్ల నర్సింగ్ హాస్టళ్లు ఏర్పాటు చేయబోతున్నారు. నర్సులకు అక్కడే ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
స్వయం ప్రతిపత్తి: మూడు నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఒక డైరెక్టర్తోపాటు కొంతమంది ఆర్ఎంవోల అధీనంలోనే పాలనంతా సాగుతుంది.
పేదలకు ఉచిత వైద్యం: నిమ్స్ తరహాలోనే కొత్త వైద్యశాలల్లో పేదలకు ఉచిత వైద్యం అందిస్తారు. అన్ని రకాల వైద్య సేవలు, అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉంటాయి.
భవనాల నిర్మాణాలకు త్వరలో టెండర్లు
గణపతిరెడ్డి, ఈఎన్సీ, ఆర్అండ్బీ
సీఎం ఆదేశాల మేరకు కొత్త ఆస్పత్రుల భవనాల నిర్మాణం కోసం టెండర్లను పిలవబోతున్నాం. కొత్తపేటలోని 22 ఎకరాల్లో 15 అంతస్తుల పైనే ఆస్పత్రి భవనం నిర్మించనున్నాం. కంటోన్మెంట్ బోర్డు ఇచ్చే అనుమతి మేరకు అల్వాల్లోని 28 ఎకరాల్లో ఎన్ని అంతస్తులు నిర్మించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రుల్లో 50 ఎకరాలు అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నిర్ణయానికి వస్తాం. గుత్తేదారు సంస్థకు పనులను అప్పగించిన తరువాత వేగంగా పనులను పూర్తి చేయడానికి ప్రణాళికను రూపొందించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు