పల్లెలపై కాలుష్యం పడగ.. పర్యవేక్షణ పడక
ఐదేళ్ల క్రితం ఆత్కూరు ఆటవీ ప్రాంతంలో సర్వే సంఖ్య 19లో భారీగా వ్యర్థ రసాయనాలు బయట పడ్డాయి. కంకర తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో రహస్యంగా వీటిని నిల్వ చేశారు. సంగారెడ్డి సమీపంలోని ఓ ఔషధ పరిశ్రమలో మిగిలిన వ్యర్థ
పొలాల మధ్యన జిప్సం తయారీ పరిశ్రమ
న్యూస్టుడే, పెద్దేముల్
రంగు మారిన సుద్ద మట్టి
* ఐదేళ్ల క్రితం ఆత్కూరు ఆటవీ ప్రాంతంలో సర్వే సంఖ్య 19లో భారీగా వ్యర్థ రసాయనాలు బయట పడ్డాయి. కంకర తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో రహస్యంగా వీటిని నిల్వ చేశారు. సంగారెడ్డి సమీపంలోని ఓ ఔషధ పరిశ్రమలో మిగిలిన వ్యర్థ రసాయనాలను ఇక్కడికి తెచ్చి పారబోసినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో తేలింది. ఘాటైన దుర్వాసన రావడంతో విషయం బయటకు వచ్చింది. ప్రతి ట్యాంకరుకు రూ.20 వేల చొప్పున చెల్లించి వీటిని అటవీ ప్రాంతాల్లో పారబోసినట్లు పోలీసులు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
* కందనెల్లి రెవెన్యూ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో అటవీ ప్రాంతానికి పక్కనే వ్యర్థ రసాయనాలతో జిప్సం తయారీ చేస్తున్నారు. దీని తయారీతో ప్రజలు ఊపిరి తీసుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో చిన్నారులు, వృద్ధులు దుర్వాసన భరించలేక అస్వస్థతకు గురవుతున్నారు. పరిశ్రమను మూసివేయాలని గిరిజనులు కోరుతుంటే నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.
వికారాబాద్ జిల్లా ఒకప్పుడు పచ్చందాలకు పెట్టింది పేరు. కాలక్రమంలో యథేచ్ఛగా చెట్లను కొట్టేయడం, రోజురోజుకు నిర్మాణాలు పెరుగుతుండటం తదితర కారణాలతో పచ్చదనం తరిగిపోతోంది. దీనికితోడు కోరలుచాస్తున్న కాలుష్యం.. ప్రధానంగా సంగారెడ్డి, హైదరాబాద్ నగరాల చుట్టూ నెలకొన్న ఔషధ పరిశ్రమల్లో మిగిలిన వ్యర్థ రసాయనాలను జిల్లాలోని పల్లెలు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదలతో నిండిన పొలాల్లో పారబోసి కంపెనీలు చేతులు దులిపేసుకుంటున్నాయి. తద్వారా ఘాటైన వాసనలు పల్లె ప్రజలను అనారోగ్యం పాలుచేస్తున్నాయి. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
నిల్వ చేసిన వ్యర్థ రసాయనాలు
అసలు ఏం జరుగుతోంది
కందనెల్లి గ్రామ రెవెన్యూ శివారు కందనెల్లి తండా సమీపంలో మూడేళ్ల క్రితం జిప్సం పరిశ్రమను నెలకొల్పారు. పొలాల మధ్యన ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రదేశం ఉంది. అత్యంత రహస్యంగా జిప్సంను తయారు చేస్తున్నారు. ట్యాంకర్లలో వచ్చే రసాయనాలను తొట్ల మాదిరిగా ఉండే వాటిల్లో పారబోస్తున్నారు. దానికి స్థానికంగా లభించే నాపరాతి పొడిని మిశ్రమంగా కలిపేస్తున్నారు. మట్టిలో ఇలా రోజుల తరబడి నిల్వ చేసి ఆ తర్వాత ముద్దలు ముద్దలుగా లారీల్లో తరలిస్తున్నారు.
నిరసన తెలిపినా హామీలతో సరి
జిప్సం తయారీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఏ రసాయనాలు వాడుతున్నారనే విషయాన్ని ఏ ఒక్క అధికారి పరిశీలించలేదు. అనేక సార్లు బాధిత ప్రజలు పరిశ్రమలోకి వెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా స్థానికులు తీవ్ర ఆందోళన చేయడంతో పరిశ్రమను మూసేయిస్తామంటూ అధికారులు హామీలతో సరిపెట్టారు.
ఎన్నెన్నో కష్టాలు..
* జిప్సం తయారీ పరిశ్రమ అటవీ ప్రాంతం పక్కనే ఉంది. ఘాటైన వాసనలతో అడవి జంతువులు సైతం ఊపిరి తీసుకోలేని స్థితి ఏర్పడింది.
* అంతారం పెద్ద చెరువు, జంతి కుంట, అటవీ ప్రాంతంలోని చిన్న కుంటలు, చెక్ డ్యాంలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ నుంచి రసాయనాలు దిగువన ఉన్న చెరువు నీటిలో కలిసి కలుషితం అవుతున్నాయి.
* వ్యర్థ రసాయనాలతో తయారు చేస్తున్న జిప్సం వల్ల తాండూరు మండలం అంతారం, అంతారం తండా, పెద్దేముల్ మండలం కందనెల్లి తండా, గొట్లపల్లి గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గర్భస్రావాలు అధికం అయ్యాయి
భజనీబాయి, కందనెల్లి తండా
ఈ పరిశ్రమ కారణంగా మహిళల ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం లేదు. గర్భస్రావాలను అవుతున్నాయి. ఇప్పటికే తండాలో నలుగురికి పిండం ఎదగకపోవడం వల్ల గర్భస్రావం చేయించారు.
గింజ ఇంటికి రాలేదు
శంకర్, కందనెల్ల్లి తండా
ఏళ్లుగా పంటను సాగు చేసి జీవనం సాగిస్తున్నాం. మూడేళ్లుగా పరిస్థితి మారిపోయింది. పరిశ్రమ ఏర్పాటుతో మా బతుకులలో మట్టి పోశారు. గింజ ఇంటికి రావడం లేదు.
పోరాటం కొనసాగుతుంది
మధులత, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు, పెద్దేముల్
నా సొంత రెవెన్యూ గ్రామంలో పరిశ్రమ నుంచి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు రాత పూర్వకంగా తెలియజేశాను. రెవెన్యూ అధికారులు విచారణ జరిపి మధ్యలోనే వదిలేశారు. పూర్తి స్థాయిలో పరిశ్రమను మూసివేసే వరకు ప్రజల తరపున మా పోరాటం కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM