తరుణం ముంపుకొస్తోంది
భాగ్యనగరానికి సెప్టెంబరు 28, 1908లో వచ్చిన వరద తీవ్రంగా దెబ్బకొట్టింది. మూసీకి ఎగువ నుంచి భారీగా వరద రావడం, సమాంతరంగా నగరంలో మూడు రోజులపాటు 43 సెం.మీ వర్షం కురవడంతో నగరం మొత్తం మునిగిపోయింది. తర్వాత అక్టోబరు 17, 2020న ఆరు గంటల వ్యవధిలో 30 సెం.మీ వాన పడింది. మియాపూర్ నుంచి అమీర్పేట వరకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. లంగర్హౌజ్ నుంచి మూసారాంబాగ్ వరకు మూసీ నదిపై ఉన్న వంతెనలను వరద ముంచెత్తింది. హుస్సేన్సాగర్ వరదనీటి నాలా ఉప్పొంగడంతో అశోక్నగర్, హిమాయత్నగర్ ప్రాంతాల్లోని కొన్ని కాలనీలు నీట మునిగాయి.
నెమ్మదిగా కొనసాగుతున్న నాలాల విస్తరణ
రెండేళ్ల క్రితం వరద మంచెత్తిన ప్రాంతాల్లో భయం
ఈనాడు, హైదరాబాద్
కేశవగిరి: అక్టోబరు 2020లో కురిసిన కుండపోత వాన పాతబస్తీ బండ్లగూడ పల్లెచెరువు, బార్కస్లోని గుర్రం చెరువులు పూర్తిగా నిండి ముర్కినాలాను ముంచెత్తాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు పల్లెచెరువు వరద నాలా విస్తరణ పనులు రూ.25 కోట్లతో చేపట్టారు. జహంగీరాబాద్, అలీనగర్, కబ్గీర్నగర్, అల్జుబైల్కాలనీల్లో నాలాను విస్తరించి రక్షణ గోడ నిర్మించారు. ఫలక్నుమా ఆర్వోబీ కింద నాలా విస్తరణ పూర్తయింది. దాంతో ఆయా ప్రాంతాలు కొంత ధైర్యంగా ఉన్నాయి. గుర్రంచెరువు దిగువన గుల్షన్ ఎక్బాల్కాలనీ నుంచి సాయిబాబానగర్ వరకు ముర్కినాలా విస్తరణకు చేపట్టిన రూ.25 కోట్ల పనులు ఇంకా టెండరు దశలో ఉన్నాయి. మళ్లీ భారీ వర్షం కురిస్తే మునగాల్సిందే.
గోల్కొండ: నానల్నగర్ డివిజన్లోని నిజాంకాలనీ, మెరాజ్కాలనీ, టోలిచౌకి డివిజన్లోని నదీంకాలనీ, విరాసత్కాలనీలు ఏటా ముంపు బారిన పడుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు హకీంపేట నుంచి అల్హస్నత్కాలనీ, నానల్నగర్, రేతీబౌలి మీదుగా మూసీలో వరదనీటిని కలిపేందుకు చేపట్టిన నాలా పనులు మొదలుకాలేదు. టోలిచౌకి బాల్రెడ్డినగర్లో పనులు కొంత మేర పూర్తయ్యాయి. విరాసత్కాలనీలో పనులు మొదలయ్యాయి.
హయత్నగర్: రెండేళ్లుగా హయత్నగర్ డివిజన్లోని బాతుల చెరువుకు దిగువనున్న బంజారాకాలనీ, అంబేడ్కర్ నగర్, రంగనాయకులగుట్ట తదితర కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ముంపును నివారించేందుకు రూ.10కోట్లతో బంజారా కాలనీ రోడ్డులోని ఆర్టీసీ మజ్దూర్ కాలనీ, తిరుమల కాలనీ మీదుగా పనులు ప్రారంభించగా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు సాగుతున్నాయి.
పహాడీషరీఫ్: జల్పల్లి పురపాలిక పరిధి బురాన్ఖాన్ చెరువు పరిసరాలను రెండేళ్లుగా వరద ముంచెత్తుతోంది. ఎఫ్టీఎల్లో నిర్మాణాల విషయం న్యాయస్థానంలో ఉందని దీంతో పనులు చేపట్టలేకపోతున్నామని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేతులు దులిపేసుకుంటున్నారు. సమస్యను పరిష్కరించకపోతే రాబోయే వర్షాకాలంలో బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలోని వెంకటాపూర్ నీట మునిగే అవకాశముంది.
అంబర్పేట: అంబర్పేటలో నాలాల విస్తరణకు రూ.22కోట్లు కేటాయించినా.. పనులు ప్రారంభం కాలేదు. నాలా విస్తరణతో సమస్యను పరిష్కారిస్తామంటూ నేతల హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
బండ్లగూడ: వందలాది ఇళ్లను, పదుల కాలనీలను ఏటా నీట ముంచుతోన్న బండ్లగూడ చెరువు ఆక్రమణలతో రూపం కోల్పోయింది. వరద ఎక్కువైనప్పుడు వెనకున్న బండ్లగూడ ప్యారనగర్, అయ్యప్పకాలనీ, మల్లికార్జుననగర్, తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మన్సూరాబాద్-బండ్లగూడ-నాగోలు-మూసీ వరకు నాలా పనులు రూ.63 కోట్లతో చేపట్టారు. సగం పూర్తయ్యాయి.
పల్లెచెరువు దిగువన బండ్లగూడ జహంగీరాబాద్ వద్ద విస్తరించిన ముర్కినాలా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!