logo

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి దుర్మరణం

బైక్‌ను మరో వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సంబంధిత వివరాలను టూ టౌన్‌ సీఐ వి.రవికుమార్‌ తెలిపారు. సిద్దిపేట అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ప్రసాద్‌రావు (64) ఆయుర్వేదిక్‌ విభాగంలో ఫార్మసిస్టుగా పనిచేసి

Published : 22 May 2022 03:46 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: బైక్‌ను మరో వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సంబంధిత వివరాలను టూ టౌన్‌ సీఐ వి.రవికుమార్‌ తెలిపారు. సిద్దిపేట అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ప్రసాద్‌రావు (64) ఆయుర్వేదిక్‌ విభాగంలో ఫార్మసిస్టుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. నాడీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వచ్చే క్రమంలో కరీంనగర్‌ మార్గంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద మలుపు తిప్పారు. ఈక్రమంలో ఎదురుగా వచ్చిన మరో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని సికింద్రాబాద్‌కు తరలించారు. అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం మృతుడి కుమారుడు విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని