ఏక రూపం... కుట్టేద్దామా ఎంచక్కా..
‘రోజుకో రూపాయి పొదుపు’తో సుమారు పాతికేళ్ల కిందట మహిళా సంఘాలు ఆవిర్భవించాయి. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలతో అప్రతిహతంగా సాగుతున్నాయి. ఆర్థికంగా కుటుంబాలను బాగు చేసుకుంటున్నాయి.
పొదుపు సంఘాలకు బాధ్యతలు
జతకు రూ.50
న్యూస్టుడే, బొంరాస్పేట,కొడంగల్ గ్రామీణం
‘రోజుకో రూపాయి పొదుపు’తో సుమారు పాతికేళ్ల కిందట మహిళా సంఘాలు ఆవిర్భవించాయి. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలతో అప్రతిహతంగా సాగుతున్నాయి. ఆర్థికంగా కుటుంబాలను బాగు చేసుకుంటున్నాయి. అలాంటి సంఘాలకు ప్రభుత్వం తాజాగా ఏకరూప దుస్తులు కుట్టించే బాధ్యతలను అప్పగించే పనిలో ఉంది. దీన్లో భాగంగా సంఘాల్లో ఉంటూ కుట్టు పని వచ్చి ఆసక్తి, అనుభవమున్న మహిళలను గుర్తించే పనిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లాలో ఇలా....
జిల్లాలోని 19 మండలాల్లో ప్రభుత్వ బడులకు తోడుగా కస్తూర్బా, గురుకుల, ఆదర్శతో కలిపి 1,107 పాఠశాలలున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు సాగలేదు. ఈ ఏడాది ప్రారంభం అనంతరం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు 2022- 23 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయిలోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడానికి అడుగులు పడుతున్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. ఈ కారణంగా ఈసారి ప్రవేశాల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
లక్ష్యం నెరవేర్చేందుకే ఈ మార్పు...
ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదని గుర్తించిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా విద్యా శాఖాధికారులతో సమీక్షించారు. పొదుపు సంఘాలు చురుగ్గా పని చేస్తున్న నేపథ్యంలో ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతలను వారికే అప్పగించాలనే ఆలోచనకు వచ్చారు. స్థానికంగా ఉంటున్న మహిళలైతే విద్యార్థులకు దుస్తులు కుట్టడంలో నాణ్యత పాటిస్తారని, తేడాలున్నా వారే సరి చేస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతి జత దుస్తులకు రూ.50 చొప్పున అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పొదుపు సంఘాల్లో చురుగ్గా ఉంటూ కుట్టు పని చేస్తున్న మహిళలను క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పొదుపు సంఘాల మహిళలతోనే కుట్టించాలని అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఏటా రెండు జతలు ఉచితం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రెండు జతలు ఏకరూప దుస్తులను ఉచితంగా అందిస్తున్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలకు వస్త్రం వస్తే స్థానిక దర్జీలతో కుట్టించి విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ ధ్యేయం. ఇలా చేస్తే సొంతూరులోని దర్జీలకు ఉపాధి లభిస్తుందని అధికారులు ఆశించారు. కుట్టు కూలీ సకాలంలో అందకపోవటం, గిట్టుబాటు లేని ధరలతో స్థానికులు కుట్టేందుకు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో పట్టణాల్లోని పెద్ద దర్జీలే వస్త్రం తీసుకెళ్లి కుట్టిన దుస్తులు పాఠశాలలకు ఇస్తూ వస్తున్నారు.
దర్జీల వివరాలు సేకరిస్తున్నాం
- రవికుమార్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి, వికారాబాద్
పొదుపు సంఘాల్లోని దర్జీలతోనే ఏకరూప దుస్తులు కుట్టించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా సంఘాల్లోని కుట్టు పని తెలిసిన మహిళల వివరాలను గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను అడిగాం. ఆసక్తి, అనుభవమున్న మహిళల సమాచారం సేకరిస్తున్నాం. వస్త్రం వచ్చిన వెంటనే విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు చేరవేస్తాం. వారంతా స్థానికంగా పొదుపు సంఘాల మహిళలతో దుస్తులు కుట్టిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్