logo

Road Accident: అన్నకు బైక్‌ కొని తీసుకొస్తూ అనంత లోకాలకు..

ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దేశంకాని దేశం వెళ్లి ఇటీవలే వచ్చాడు. అన్నకు  బైక్‌ కొనిపెట్టి తిరిగి ఊరెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ డీకే లక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా

Updated : 24 May 2022 09:15 IST

శ్రీనివాస్‌

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దేశంకాని దేశం వెళ్లి ఇటీవలే వచ్చాడు. అన్నకు  బైక్‌ కొనిపెట్టి తిరిగి ఊరెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ డీకే లక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం రాజాపూర్‌కు చెందిన పిచ్చకుంట్ల శ్రీనివాస్‌(29) బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. వారం క్రితమే సొంతూరుకు వచ్చాడు. సోమవారం అన్న నర్సింహులుకు బైక్‌ కొనేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. శ్రీనివాస్‌ ఆ బైక్‌పై గ్రామానికి బయలుదేరగా, అన్న నర్సింలు మరో వాహనంపై వస్తున్నాడు. మొయినాబాద్‌ సమీపంలోని తాజ్‌హోటల్‌ వద్ద వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంపై వస్తున్న శ్రీనివాస్‌ను ఢీకొంది.  తలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకే వస్తున్న అన్న నర్సింహులు జరిగిన ఘోరాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. బోరున విలపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. శ్రీనివాస్‌ 15రోజుల్లో మళ్లీ దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని