logo

రాంగోపాల్‌వర్మపై కేసు

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ తిరుపతిరావు, ఎస్సై యాదగిరిరావు కథనం ప్రకారం.. మియాపూర్‌ మాతృశ్రీనగర్‌వాసి శేఖర్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ అనే సినీ

Published : 24 May 2022 01:50 IST

మియాపూర్‌: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ తిరుపతిరావు, ఎస్సై యాదగిరిరావు కథనం ప్రకారం.. మియాపూర్‌ మాతృశ్రీనగర్‌వాసి శేఖర్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ అనే సినీ నిర్మాణ సంస్థ నిర్వాహకులు శేఖర్‌రాజు 2020లో దర్శకుడు రాంగోపాల్‌వర్మకు రూ.56లక్షలు అందజేశారు. ఆ నగదు తిరిగి చెల్లించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 8వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని