అక్రమ నిర్మాణదారులకు జలక్
రాజధాని, శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనుమతుల్లేని అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లకు ఇకపై రిజిస్ట్రేషన్లు చేయొద్దని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆదేశించింది. అక్రమ లేఅవుట్లలోని స్థలాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాజధాని పరిధిలో దాదాపు లక్ష ఫ్లాట్లు,
లక్ష ఫ్లాట్లు, వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
రాజధాని, శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనుమతుల్లేని అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లకు ఇకపై రిజిస్ట్రేషన్లు చేయొద్దని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆదేశించింది. అక్రమ లేఅవుట్లలోని స్థలాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాజధాని పరిధిలో దాదాపు లక్ష ఫ్లాట్లు, వేలాది స్థలాల(ప్లాట్ల) రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
అక్రమ లేఅవుట్లలోని స్థలాలను, అక్రమంగా వెలసిన అపార్టుమెంట్లలోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల కిందట ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటివి రాజధానిలో లక్ష ఫ్లాట్లు ఉంటాయని అంచనా వేశారు. ఒక్క నిజాంపేటలోనే 1200 అపార్ట్మెంట్లను రెండేళ్ల కిందట సీజ్ చేశారు. వీటిలో 15,000 ఫ్లాట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు నిలిపేయడంతో ఫ్లాట్ల యజమానులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. డాక్యుమెంట్పై అనుమతి లేని నిర్మాణమని పేర్కొని, వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. 5 వేల మంది ఇలా లబ్ధిపొందారు. తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్రమ నిర్మాణాల్లో రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ సుప్రీంకోర్టు 4 రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలివ్వడంతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది.
ఉల్లంఘిస్తే వేటే
దుండిగల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, జీడిమెట్ల, బండ్లగూడ జాగీర్ తదితర వందలాది ప్రాంతాల్లో బిల్డర్లు రెండంతస్తులకు అనుమతులు తీసుకుని అయిదారు అంతస్తులు వేశారు. రిజిస్ట్రేషన్ అధికారులకు అంతోఇంతో ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ పర్వానికి బ్రేకు పడింది. కొద్ది రోజుల కిందట దుండిగల్లో అక్రమ నిర్మాణాలపై ‘ఈనాడు’ వరుస కథనాలు ఇవ్వడంతో దాదాపు 210 అపార్టుమెంట్లను అక్రమంగా నిర్మించారని గుర్తించి పాక్షికంగా కూల్చివేశారు. తరువాత పట్టించుకోకపోవడంతో కొన్నింటిని తిరిగి నిర్మించారు. నిజాంపేటలోనూ అలాగే జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఇకపై ఒక్క అక్రమ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చేసినా సంబంధిత అధికారులపై వేటు వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
కడితే కూల్చేస్తారు
హెచ్ఎండీఏ పరిధిలోని వేలాది అక్రమ లేఅవుట్లలో సుమారు లక్షన్నర ఖాళీ స్థలాలను రియల్టర్లు విక్రయించారు. తాజాగా 111 జీవో పరిధిలోని గ్రామాల వద్ద వందలాది లేఅవుట్లు వెలిశాయి. కొనుగోలుకు అడ్వాన్సులు ఇస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో స్థలాలను రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది. వాటిల్లోని నిర్మాణాలను కూల్చివేయాలని స్పష్టం చేసింది.
* అనుమతుల్లేని అపార్టుమెంట్లలో నిర్మించిన ఫ్లాట్లు: లక్ష
* అక్రమ లేఅవుట్లలోని స్థలాలు: 1.50 లక్షలు
* హైకోర్టు ఆదేశాలతో రిజిస్టర్ అయిన ఫ్లాట్స్: 5000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్