రూ. 2,500 కోట్లతో శివారుకు రహదారి భాగ్యం
శివారుకు రహదారులకు అనుసంధానంగా పెద్దయెత్తున లింకు రోడ్లు నిర్మించేందుకు హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్ఆర్డీసీఎల్) రంగం సిద్ధం చేసింది. రూ.2,500 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్తో అనుసంధానం
104 లింకు రోడ్ల నిర్మాణానికి హెచ్ఆర్డీసీఎల్ ప్రతిపాదన
డీపీఆర్లు పూర్తి చేసిన డీటీసీపీ, హెచ్ఎండీఏ
ఈనాడు, హైదరాబాద్: శివారుకు రహదారులకు అనుసంధానంగా పెద్దయెత్తున లింకు రోడ్లు నిర్మించేందుకు హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్ఆర్డీసీఎల్) రంగం సిద్ధం చేసింది. రూ.2,500 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్తో అనుసంధానం చేయడం, రద్దీ ప్రాంతాల మధ్య రహదారులను విస్తరించేందుకు 104 లింకు రోడ్లను నిర్మించాలని ప్రతిపాదలను సర్కారుకు పంపింది. నిధుల సమస్య లేకుండా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా పురపాలకశాఖ ఏర్పాట్లు చేసిందని, త్వరలో మొదటి దశ పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుందని స్పష్టం చేస్తున్నారు. పనులు పూర్తయితే శివారు ప్రాంతాల మధ్య దూరం తగ్గుతుంది. కార్పొరేషన్లలోని ఇరుకు రోడ్లు విస్తరణకు నోచుకుంటాయి.
భవిష్యత్తు దృష్ట్యా 100 అడుగుల రోడ్లు..
హైదరాబాద్ నగరంలో మాదిరి.. నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనాభా అంతకంతకు విస్తరిస్తోంది. జనావాసాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నార్సింగి, మణికొండ, బండ్లగూడజాగీర్ ప్రాంతాల జనాభా విపరీతంగా పెరుగుతోంది. నగరానికి తూర్పున ఉన్న ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గతంలో శివారులోని పలు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది. కొనసాగింపుగా.. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రోడ్ల విస్తరణకు నడుం బిగించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెజార్టీ రహదారులను 100అడుగుల మేర, భూసేకరణ కష్టంగా ఉన్న ఐదు ప్రాంతాల్లో 80అడుగుల మేర రహదారిని విస్తరిస్తున్నామని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు ‘ఈనాడు’తో తెలిపారు. ఉదాహరణకు.. దమ్మాయిగూడ నుంచి జవహర్నగర్ వెళ్లే రోడ్డు ప్రస్తుతం 60అడుగులుగా ఉంది. దానిపై వాహనాల రాకపోకలు కష్టతరమవుతున్నాయి. ఆ రోడ్డును 100 అడుగుల మేర విస్తరించాలని హెచ్ఆర్డీసీఎల్ నిర్ణయించింది. వర్షాకాలంలోనూ పనులు కొనసాగుతాయని, ప్రభుత్వం అనుమతిస్తే ఏడాది నుంచి రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
హెచ్ఎండీఏ ద్వారా..
జీహెచ్ఎంసీ పరిధిలో రెండు దశల లింకు రోడ్ల పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. గ్రేటర్లోని మూడో దశ లింకు రోడ్ల ప్రతిపాదనలతోపాటు కేవలం శివారు ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన రూ.2,500 కోట్ల పనుల ప్రతిపాదనలూ ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రాధాన్యక్రమంలో మొదట చేపట్టేందుకు 40 లింకు రోడ్లను గుర్తించామని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)