నగరంలో 132 కేవీ.. శివార్లలో 220 కేవీ
విద్యుత్తు వాడకం అధికమవడం.. ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరుగుతుండటంతో ట్రాన్స్కో నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు,
నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు వాడకం అధికమవడం.. ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరుగుతుండటంతో ట్రాన్స్కో నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు, ఫార్మా సంస్థల కార్యకలాపాలు ఊపందుకోవడంతో అక్కడ విద్యుత్తు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో 132 కేవీ, శివార్లలో (అవుటర్) 220 కేవీ ఉపకేంద్రాలు నిర్మించనున్నారు. బౌరంపేటలో ఇప్పటికే 220 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం పనులు పురోగతిలో ఉండగా, సీతారాంబాగ్లో కొత్తగా 132 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణం చేపట్టబోతుంది. అసిఫ్నగర్ నుంచి సీతారాంబాగ్ వరకు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు.
70 శాతానికి చేరితే..
విద్యుత్తు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలను టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్మించి నిర్వహిస్తోంది. ఇందుకోసం 400, 220, 132 కేవీ ఉప కేంద్రాలు నిర్మిస్తుంది. జెన్కో, ఇతర ఉత్పత్తి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్టెప్డౌన్ చేస్తూ ట్రాన్స్కో సరఫరా చేస్తుంది. ఉప కేంద్రాలపై లోడు 70 శాతానికి చేరితే.. కొత్త వాటి నిర్మాణంపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం అసిఫ్నగర్ ఉప కేంద్రం లోడు 70 శాతానికి చేరిందని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు సీతారాంబాగ్లో కొత్తగా 132 కేవీ ఉప కేంద్రాన్ని నిర్మించనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ రెండు ఉపకేంద్రాల మధ్య ఆరు లేన్లలో అసిఫ్నగర్ నుంచి మెహిదీపట్నం మీదుగా సీతారాంబాగ్ వరకు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల దూరం భూగర్భ కేబుళ్లు వేస్తారు. రద్దీగా ఉండే మెహిదీపట్నం రహదారి కింద 1.8 మీటర్ల లోతులో ఆరు కేబుళ్లు వేయనున్నారు. మెహిదీపట్నంలో ఇప్పటికే రహదారి తవ్వి వివరాలను సేకరించారు. పనుల వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఖర్చు తగ్గించేందుకు స్టోర్లోని కేబుల్నే వినియోగించనున్నారు. చివర్లో తగ్గితే అప్పుడు కొనుగోలు చేస్తామని ట్రాన్స్కో ట్రాన్స్మిషన్ డైరెక్టర్ టి.జగత్రెడ్డి తెలిపారు.
మూడు విధాలుగా..
బౌరంపేటలో హైటెన్షన్ టవర్లు, మోనోపోల్స్, భూగర్భ కేబుళ్లు.. ఇలా మూడు విధాలుగా కేబుళ్లు వేస్తున్నారు. నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ మీదుగా బౌరంపేట వరకు దాదాపు 35 కి.మీ. దూరం ఉంటుంది. అవుటర్ దాకా హైటెన్షన్ టవర్ల ద్వారా దాదాపు 25 కిలోమీటర్లు ఓవర్ హెడ్ లైన్లు వేస్తున్నారు. అవుటర్ వెంట 5 కి.మీ. పొడవున మోనోపోల్స్ వేస్తున్నారు. తొలిసారి ఈ స్తంభాలను రాయదుర్గం 400 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం లైన్లలో వాడారు. ఇప్పుడు బౌరంపేటలో ఉపయోగిస్తున్నారు. అవుటర్ లోపల నుంచి బౌరంపేట వరకు మరో ఐదు కిలోమీటర్లు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు. యూజీ కేబుల్ పనులు ఇప్పటికే 3 కి.మీ. పూర్తయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి