పోషకాహారం.. చిన్నారులకు ఆరోగ్యం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాల కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా
మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
న్యూస్టుడే, పరిగి
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాల కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే నూతన విద్యా సంవత్సరం నుంచి ‘పీఎం పోషణ్ పథకం (మధ్యాహ్న భోజనం)’ కింద పాఠశాలల్లో పల్లీ పట్టీకి బదులుగా రాగి జావ, మొలకలు, బెల్లం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా కేంద్ర విద్యాశాఖ అనుమతించింది. విద్యార్థుల్లో పోషకాహార లోప నివారణకు ఇది చక్కటి మార్గంగా ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
పేద కుటుంబాలే అధికం
జిల్లా అచ్చంగా గ్రామీణ ప్రాంతం కావడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. రవాణా వసతి సక్రమంగా లేకపోవడం, బడిగంట ప్రారంభమవుతుందని చాలా మంది విద్యార్థులు పాఠశాల సమయానికి ఇంట్లో భోజనం చేయకుండానే పరుగులు పెడుతున్న సంఘనలు నిత్యం కనిపిస్తుంటాయి. తద్వారా వారికి పోషకాహారం అందకపోవడంతో అనారోగ్యం బారిన పడి హాజరు శాతంపై ప్రభావం చూపుతోంది. కొంతలో కొంత నయం అన్నట్లుగా బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం వేలాది మంది పిల్లల కడుపునింపుతోంది.
1.10 లక్షల మందికి ప్రయోజనం
జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో 764 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 174 ఉన్నత పాఠశాలల్లో 1,10,847 మంది విద్యార్థులు ఉన్నారు. రాగి జావతో పాటు మొలకలు, బెల్లం అందజేస్తే 1.10లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తే..
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు విడుదలవుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపం కారణంగా అవి మూణ్ణాళ్ల ముచ్చటే అవుతున్నాయి. ప్రధానంగా వంట గదుల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ఉపాధిహామీ నిధులతో మూడేళ్ల క్రితం చేపట్టిన వంట గదుల నిర్మాణాలు ఇంకా అనేక చోట్ల నత్తనడకనే సాగుతున్నాయి. పరిగిలోని జడ్పీహెచ్ఎస్ నం.2, 1 పాఠశాలలే ఇందుకు నిదర్శనం. ఆరేళ్ల క్రితం రూ.8లక్షల అంచనా వ్యయంతో స్థానికంగా విద్యార్థుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించారు. అవి వాడకుండానే వాటిని కూల్చేశారు. ప్రస్తుతం నం.2 పాఠశాలలో ఇవి విద్యార్థులకు సరిపడా లేవు. ఇలాంటి కనీస సౌకర్యాలు సక్రమంగా లేక సతమతమవుతున్నారు. వీటన్నింటిని మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది.
హాజరు శాతం పెరుగుతుంది : హరిశ్చందర్, మండల విద్యాధికారి, పరిగి
మధ్యాహ్న భోజనం అమలుతో విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాగి జావతో పాటు మొలకలు, బెల్లం అందజేస్తే నిజంగా పేద విద్యార్థులకు వరంగా మారుతుంది. విద్యార్థుల ఆరోగ్యం కూడా మరింత మెరుగు పడేందుకు దోహదం చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలల నుంచి గతేడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 10వేలకు పైగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. ప్రభుత్వాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయి.
ఆరోగ్యం మరింత మెరుగు: రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి
మధ్యాహ్న భోజనంలో మార్పులు తీసుకురావడం చాలా సంతోషం. విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తే మానసికంగా, శారీరకంగానూ బలంగా తయారవుతారు. రాగి జావతో పాటు మొలకలు, బెల్లం అందజేస్తే నిజంగా పేద విద్యార్థులకు వరంగా మారుతుంది. ప్రైవేట్ పాఠశాలల నుంచి గతేడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 10వేలకు పైగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. ప్రభుత్వాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయి. వచ్చే ఏడాది వందల సంఖ్యలో పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయి. దీంతో ఇంకా విద్యార్థులు చేరే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?