అభివృద్ధికి నిధుల గండం...అప్పులతో సతమతం
బషీరాబాద్ మండలంలో ఓ సర్పంచి అప్పులు తెచ్చి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. ఐదు మాసాల నుంచి బిల్లులు అందకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవడంతో ఎకరా పొలం అమ్మి అప్పులు చెల్లించడం చర్చనీయాశంగా మారింది.
నిలిచిన రూ.50 కోట్లు
ఐదు నెలలుగా చెక్కులకు కలగని మోక్షం
* బషీరాబాద్ మండలంలో ఓ సర్పంచి అప్పులు తెచ్చి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. ఐదు మాసాల నుంచి బిల్లులు అందకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవడంతో ఎకరా పొలం అమ్మి అప్పులు చెల్లించడం చర్చనీయాశంగా మారింది.
* ధారూర్ మండలంలోని ఓ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు కలిపి నెలకు రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ఐదు నెలలుగా బిల్లులకు మోక్షం కలగక పోవడంతో ఆ సర్పంచి అప్పులు తెచ్చి ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు.
- జిల్లాలో చాలా మంది సర్పంచులు ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
న్యూస్టుడే, వికారాబాద్
‘గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు.’ ఇందుకోసం సర్పంచులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషిచేయాలి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావాలి. తద్వారా ప్రగతి పనులు చకచకా సాగుతాయి. జిల్లాలో ఈ తరహా వాతావరణం కనిపించడంలేదు. సర్పంచులు వడ్డీకి తెచ్చి అభివృద్ధికి వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో ఐదు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. చేసిన ఖర్చులకు కోశాధికారి కార్యాలయం (ట్రెజరీ)లో చెక్కులు జమ చేసినా ఉపయోగం ఉండటం లేదు. నెలకు రూ.10 కోట్ల చొప్పున ఐదు మాసాలకు రూ.50 కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. దీంతో ఖాతాలో నిధులున్నా ప్రభుత్వం అనధికార ఫ్రీజింగ్ పెట్టడంతో డ్రా చేసుకోవడానికి వీలు కావడం లేదు. నిధుల లేమి కారణంగా త్వరలో చేపట్టే ‘పల్లె ప్రగతి’పై ప్రభావం పడక తప్పదని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
నెలకు రూ.లక్ష వరకు ఖర్చు..
పంచాయతీల నిర్వహణ మొత్తం సర్పంచులే చూసుకుంటారు. ట్రాక్టర్లకు డీజిల్, వీధి దీపాలు, బోరుమోటార్ల మరమ్మతులు, కార్మికుల జీత భత్యాలు వారే చూసుకుంటున్నారు. చెక్కులు మంజూరైన తర్వాత తీసుకోవచ్చనే ధీమాతో అప్పులు తెచ్చి ఆగకుండా పనులు నడిపిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్య మవుతున్నారు. బిల్లులు రావడం లేదని బయటకు చెప్పినా అంతగా ప్రయోజనం ఉండదని మౌనం వహిస్తున్నట్లు కొందరు సర్పంచులు వాపోయారు.
రెండోసారి పంపినా..
పంచాయతీల ఖర్చులకు సంబంధించిన చెక్కులను ఈ ఏడాది జనవరి నుంచి కోశాధికారి కార్యాలయానికి పంపిస్తున్నారు. చెక్కుల కాల పరిమితి మూడు నెలలు మాత్రమే ఉండటంతో మార్చి వరకు పంపినవి చెల్లుబాటు కాకుండా పోయాయి. ఏప్రిల్లో రెండోసారి పంపించారు. ఇంతలో ప్రభుత్వం నిలిపివేత (ఫ్రీజింగ్) నిబంధన పెట్టడంతో మోక్షం కలగడం లేదు. కేవలం విద్యుత్తు బిల్లులకు సంబంధించిన చెక్కులు మాత్రమే చెల్లుబాటవుతున్నాయి. గతంలో పంచాయతీ కార్మికుల వేతనాలు ప్రతి నెల 5వ తేదీలోపు వచ్చేవి. అవికూడా ఐదు నెలలుగా నిలిచిపోయాయి.
ఆర్థిక భారంతో సతమతం
- శ్రీనివాస్రెడ్డి, అధ్యక్షుడు, మండల సర్పంచుల సంఘం, మోమిన్పేట
బిల్లులు మంజూరు కాకపోవడంతో సర్పంచులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. పనులు చేసినా బిల్లులు రావడం లేదన్న కారణంతో సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిణామం గ్రామాభివృద్ధికి అవరోధంగా మారుతోంది. అందుకే పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు అందేలా చూడాలి.
త్వరలో మంజూరవుతాయి
- మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
పంచాయతీల చెక్కులు క్లియర్ కాకపోవడం వాస్తవమే. వివిధ పనుల తాలూకూ అపరిష్కృత బిల్లులు త్వరలో మంజూరు కానున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ముందు వేసిన చెక్కుల కాలపరిమితి ముగియడంతో మరోమారు కోశాధికారి కార్యాలయానికి పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డబ్బులు డ్రా కావడం లేదు. చెక్కులన్నీ ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
[ 20-04-2024]
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.