క్షణాల్లో మంటలు.. మిన్నంటిన హాహాకారాలు
ఖాజాగూడ చౌరస్తా సమీపంలోని హైమార్క్ ఛాంబర్ నాలుగంతస్తుల భవనంలో శనివారం ఉదయం 9.30-10 మధ్య జరిగిన అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. రెండో అంతస్తులో రేగిన మంటలు, పొగ నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో అక్కడున్న ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలు
ఖాజాగూడ చౌరస్తాలో నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
టెర్రస్ పైకి ఎక్కిన 14 మందిని స్కైలిఫ్ట్ సాయంతో రక్షించిన సిబ్బంది
హైమార్క్ ఛాంబర్ భవనం నుంచి దట్టంగా వ్యాపించిన పొగ
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, రాయదుర్గం, గౌతంనగర్: ఖాజాగూడ చౌరస్తా సమీపంలోని హైమార్క్ ఛాంబర్ నాలుగంతస్తుల భవనంలో శనివారం ఉదయం 9.30-10 మధ్య జరిగిన అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. రెండో అంతస్తులో రేగిన మంటలు, పొగ నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో అక్కడున్న ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. భవనం పైభాగానికి చేరుకొని రక్షించండంటూ కేకలేశారు. రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మాదాపూర్ అగ్నిమాపకశాఖ కార్యాలయానికి సమాచారం చేరవేశారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని టెర్రస్పైకి ఎక్కిన 14 మందిని బ్రాంటో స్కైలిఫ్ట్ సాయంతో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అంబులెన్స్ల్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ ఏసీపీ రఘునందన్రావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి(డీఎఫ్ఓ) శ్రీధర్రెడ్డి, రాయదుర్గం సీఐ తిరుపతి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తప్పిన పెనుముప్పు
హైమార్క్ ఛాంబర్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో గ్రీన్ బావర్చి హోటల్, మొదటి, మూడో అంతస్తులో ఐటీ సంస్థలున్నాయి. రెండు, నాలుగో అంతస్తుల్లో యాక్షన్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సెక్యూరిటీ సంస్థ కార్యాలయాలున్నాయి. శనివారం సాఫ్ట్వేర్ సంస్థలకు సెలవు కావడంతో మూసివున్నాయి. ఉదయం 10 గంటలకు రెండో అంతస్తులో విధులకు వచ్చిన యాక్షన్ గార్గింగ్ సర్వీసెస్ సంస్థకు చెందిన ఉద్యోగి సంతోష్తోపాటు మరో ఇద్దరు తాళాలు తీసి లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్టోర్ రూమ్ నుంచి మంటలు రావటం గమనించారు. కార్యాలయంలోని పరికరాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షణాల్లో మంటలు, పొగ మరింత వ్యాపించాయి. ఆందోళనకు గురైన ఇద్దరు కిందకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో ఉద్యోగి 11 గంటల ప్రాంతంలో అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు.
తలుపులు బద్దలుకొట్టి..
నాలుగో అంతస్తులోని యాక్షన్ గార్డింగ్ సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగినులతో సహా 14 మంది ఉన్నారు. భవనంపైకి దట్టమైన పొగలు వ్యాపించడంతో మెట్ల మార్గంలో కిందికి వచ్చే అవకాశం లేకపోయింది. ధైర్యం కూడదీసుకొని అందరూ టెర్రస్పైకి చేరుకోవాలనుకున్నారు. మార్గంలో తలుపులకు తాళాలు వేసి ఉండడంతో అద్దాలను బద్దలుకొట్టి పైకి చేరుకున్నారు. రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారు. 11.10 గంటలకు మాదాపూర్ నుంచి రెండు అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. టెర్రస్ పైన ఉన్నవారికి సిబ్బంది ధైర్యం చెప్పారు. 11.30 గంటలకు బ్రాంటో స్కైలిఫ్ట్ చేరుకుని, డీఎఫ్ఓ శ్రీధర్రెడ్డి నేతృత్వంలో పైన ఉన్న వారిని 40 నిమిషాల్లో కిందికి దించారు. అంబులెన్స్ల్లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి ప్రథమ చికిత్స అందించారు. 14 మందిని అరగంట సేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించి డిశ్ఛార్జి చేసినట్టు వైద్యులు తెలిపారు.
* సెక్యూరిటీ సంస్థలోని సిబ్బంది యూనిఫారాలు, షూస్, బెల్టులు తదితరాలు కాలిపోయాయి. ఫర్నిచర్ దగ్ధమైంది. సాఫ్ట్వేర్ సంస్థ కార్యాలయంలోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. 2 గంటలు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. జిల్లా అగ్నిమాకశాఖ అధికారి ఎస్.శ్రీధర్రెడ్డి, ఏడీఎఫ్వోలు గిరిధర్రెడ్డి, విజయ్కుమార్, ఎస్ఎఫ్ఓ బి.శ్రీనివాస్, టి.జగన్మోహన్ పర్యవేక్షించారు. వేగంగా స్పందించి బాధితులను కాపాడిన రాయదుర్గం పోలీసులను డీసీపీ కె.శిల్పవల్లి అభినందించారు.
బయటపడింది వీరే
కాంచమ్మ(ఖాజాగూడ), విజయ (మధురానగర్), సల్మాబేగం(అత్తాపూర్), మురాద్ కుమార్(యూపీ), రామారావు, శైలజ, షేక్సల్మా, వెంకట్ బాపిరాజు, వెంకటేశ్వర్రెడ్డి, టి.శేఖర్, తరుణ్ గోపి, చందన్, స్వర్ణరాజ్, మరో మహిళ ఉన్నారు.
భళా.. బాహుబలి స్కైలిఫ్ట్
ఐదంతస్తుల భవనంపై నుంచి కాపాడమంటూ హాహాకారాలు. లోపలకు వెళ్లేందుకు మరో మార్గం లేదు. క్రమంగా వ్యాపిస్తున్న పొగతో ఊపిరాడక ఇబ్బందిపడే పరిస్థితి. ఇటువంటి విపత్కర వేళ.. 14 మందిని సురక్షితంగా కిందకు దించి ప్రాణాలు కాపాడటంతో బాహుబలి క్రేన్ కీలకమైంది. గ్రేటర్ పరిధిలో బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనాలు ఒకటి సికింద్రాబాద్లో.. మరొకటి మాదాపూర్ అగ్నిమాపక కేంద్రాల్లో ఉంచారు. హైటెక్సిటీ పరిధిలో బహుళంతస్తుల భవనాలు, కార్యాలయాలు ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో దీన్ని బయటకు తీస్తుంటారు. ఖాజాగూడ ప్రమాదంలో మాదాపూర్ ఫైర్స్టేషన్ నుంచి స్కైలిఫ్ట్ను రంగంలోకి దించారు. 54 మీటర్ల ఎత్తు వరకూ(18 అంతస్తులు) రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగలిగే సమర్థత దీని సొంతం. అంత ఎత్తు నుంచి 400 కిలోల బరువు వరకూ సురక్షితంగా కిందకు దించగల సత్తా ఉంది. 14 మంది బాధితులను కిందకు తీసుకురావటంలో స్కైలిఫ్ట్ ఎంతో ఉపకరించిందని అగ్నిమాపకశాఖ అధికారులు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు