డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒకరి బలి
కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న మేస్త్రి దుర్మరణం పాలైన సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి పరిధిలోని ఏపీ పోలీసు అకాడమీ వద్ద చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం..
రోడ్డు పక్కన కారు ఆపి అజాగ్రత్తగా తలుపు తీయడంతో ఘటన
నార్సింగి న్యూస్టుడే: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న మేస్త్రి దుర్మరణం పాలైన సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి పరిధిలోని ఏపీ పోలీసు అకాడమీ వద్ద చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా అంకాపురం మండలం లింగాలపాలెంకు చెందిన పంజర్ల వీరస్వామి(44) బండ్లగూడజాగీర్లో మేస్త్రి పని చేస్తున్నారు. శనివారం ఉదయం 11.30గం.లకు మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని పనిచేసే ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసు అకాడమీ కూడలి వద్ద ముందుగా వెళుతున్న కారును డ్రైవర్ ట్రామా సెంటర్ వద్ద నిలిపి అజాగ్రత్తగా డోరు తెరిచాడు. వెనుక ద్విచక్రవాహనంపై వస్తున్న వీరస్వామి డోర్ను గుద్ది రోడ్డుపై పడిపోయాడు. వెనుక వచ్చిన ఆర్టీసీ బస్సు చక్రాలు వీరస్వామిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని సమీప బంధువు బంకమస్తాన్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని భార్య, పిల్లలు స్వగ్రామంలో ఉంటారని ఎస్ఐ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా