logo

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం

తెదేపా అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌.పి.భంజ్‌దేవ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆమె నివాసంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేకు కోసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. కన్యకా

Published : 21 Apr 2022 04:52 IST

సాలూరులో కేకు కోసి పంచిపెడుతున్న సంధ్యారాణి

సాలూరు, పార్వతీపురం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌.పి.భంజ్‌దేవ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆమె నివాసంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేకు కోసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పట్టణంలోని నిరాశ్రయులు, పేదలకు ఆహార పొట్లాలు అందించారు. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. నాయకులు ఎన్‌.చిట్టి, జి.వేణు, పరమేశు పాల్గొన్నారు.

చంద్రబాబు పాలన మళ్లీ ఆరంభమైతేనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో, పాత బస్టాండులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కేకు కోశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.చిరంజీవులు, కౌన్సిలర్‌ శ్రీదేవి, ఉదయభాను పాల్గొన్నారు. పాతబస్టాండు, ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండు వద్ద పేదలకు అన్నదానం చేశారు.


ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కేకు కోసి మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌కు తినిపిస్తున్న మాజీ ఛైర్‌పర్సన్‌ శ్రీదేవి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని