logo

ఇష్టంలేని పెళ్లిచూపులు..కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఇష్టం లేని పెళ్లి చూపులతో మానసిక ఒత్తిడికి గురైన ఓ కానిస్టేబుల్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్ఖానా ఎస్సై నర్సింహులు వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన

Updated : 19 Jul 2021 07:05 IST

ఆంజనేయులు

కార్ఖానా, న్యూస్‌టుడే: ఇష్టం లేని పెళ్లి చూపులతో మానసిక ఒత్తిడికి గురైన ఓ కానిస్టేబుల్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్ఖానా ఎస్సై నర్సింహులు వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన లక్ష్మి కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి, కార్ఖానా న్యూ వాసవినగర్‌లో నివసిస్తోంది. ఆమె కుమారుడు దండగల ఆంజనేయులు(25) ఏఆర్‌ కానిస్టేబుల్‌. ఇష్టం లేకపోయినప్పటికీ ఇటీవల పెద్దల సమక్షంలో అతనికి పెళ్లి చూపులు జరిపించారు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నాడు. పింఛన్‌ తీసుకునేందుకు తల్లి శుక్రవారం స్వస్థలానికి వెళ్లగా.. ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. స్థానికంగా విక్రంపురి కాలనీలో ఉండే అతని సోదరి శనివారం ఫోన్‌ చేయగా.. నైట్‌ డ్యూటీ ఉందని చెప్పాడు. రాత్రి ఫోన్‌ చేయగా ఎంతకూ స్పందించలేదు. దీంతో వరసకు సోదరుడైన క్రాంతిని ఆదివారం ఉదయం పంపింది. ఆంజనేయులు తలుపు తెరవకపోవడంతో.. స్థానికుల సాయంతో బద్దలుకొట్టి, ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని