logo

Telangana News: లారీ, 3 వ్యాన్లు, 4 కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద 65వ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్ నెలకొంది. 

Updated : 30 Apr 2022 13:03 IST

రుద్రారం: సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద 65వ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్ నెలకొంది. రుద్రారం వద్ద పలు వాహనాలు ఢీకొనడంతో ఆ మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. లారీ, మూడు వ్యాన్లు, 4 కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొనడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో జహీరాబాద్‌, షోలాపూర్‌ నుంచి వచ్చే మార్గాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ నెలకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని