Ts News: పిండి వంట.. ఆరోగ్యమే ఇంట..
సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా కరకరలాడే సకినాలు..అరిసెలు, అప్పాలు, తీయతియ్యని నువ్వుల లడ్డూలు అంటే ఇష్టపడని వారుండరు.. వీటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలున్నాయి. కరోనా వంటి వైరస్ దాడి నుంచి తమను
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా కరకరలాడే సకినాలు..అరిసెలు, అప్పాలు, తీయతియ్యని నువ్వుల లడ్డూలు అంటే ఇష్టపడని వారుండరు.. వీటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలున్నాయి. కరోనా వంటి వైరస్ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎన్నో పోషకాలు ఉండే ఈ పిండివంటలను తినడం ఎంతో మేలని వైద్యులు చెబుతున్నారు.
అరిసెలు.. బియ్యాన్ని ఒకరోజు ముందు రాత్రి కడిగి నానబెట్టి..ఉదయాన్నే పిండిలో బెల్లంపానకం, నువ్వులు వేసి తయారుచేస్తారు. ఇందులో మోనో అన్శాచురేటేడ్ ఫ్యాట్ ఉంటుంది. ఎముకల బలహీనత పోయి దృఢంగా మారుతారు. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మానసిక ఆందోళన దూరమై ప్రశాంతత లభిస్తుంది.
సున్నుండలు.. నెయ్యి, బెల్లం, గోధుమలు, మినుములతో చేసే సున్నుండలు బలాన్నిస్తాయి. మినపప్పులో మంచి పోషకాలుంటాయి. గోధుమల్లో ఫైబర్ ఉంటుంది. సున్నుండలు ఎక్కువ కాలం నిలువ ఉండే అవకాశం ఉంటుంది.
అప్పాలు.. బియ్యం, సెనగపిండి, ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసి చేస్తారు. కరకరలాడే ఈ అప్పాల్లో కలిపే సెనగపిండి ఎంతో శక్తినిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
నువ్వుల లడ్డూలు.. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు శరీరానికి పూర్తిస్థాయిలో శక్తినిస్తాయి. బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. రోజూ బెల్లం తింటే ఉత్సాహంగా ఉంటారు. రక్తహీనతతో బాధపడేవారికి ఈ లడ్డూలు ఉపయోగకరంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి. కాలేయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. జీర్ణసంబంధ వ్యాధులు దరి చేరవు.
సకినాలు.. చలికాలంలో వచ్చే ఈ పండగకు సరిపోయేలా సకినాలు ఉంటాయి. వీటిని తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. బియ్యాన్ని నానబెట్టి దంచి పిండి చేసి సకినాలు చేస్తారు. కొందరు పండగకు వారం రోజుల ముందే చేయడం మొదలుపెడతారు. ఇందులో నువ్వులు, వాము(ఓమ) వేస్తారు. నువ్వుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉన్నాయి. మహిళల్లో హార్మోన్ స్థాయులను సరిగ్గా ఉంచుతాయి. వాము జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
పండగల్లో శాస్త్రీయత ఐశ్వర్య, పోషకాహార నిపుణులు,
ప్రకృతి వైద్యురాలు, నిజామాబాద్
మన సంస్కృతిలో పండగలకు ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం..సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే అరుదైన ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభం.అంతటా చలిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో కరోనా వంటి వైరస్ల ప్రభావం పెరుగుతుంది. దీని నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటూనే..శారీరక సమతుల్యత కోసం వేడిచేసేవి, శక్తినిచ్చేవి, సులభంగా జీర్ణమయ్యే పిండి వంటకాలను తీసుకోవాలి. ఈ పండగకు చేసుకునే అన్ని పిండి వంటలను బియ్యంతోనే చేయడం విశేషం. దీనిలో ఫైబర్, బి విటమిన్ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం
[ 29-03-2024]
జిల్లా పాలనధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం తెలిపారు. -
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM