logo

Andhra News: సోమశిల గురుకులంలో పాము కలకలం

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గురుకుల పాఠశాలలో పాము కలకలం రేపింది.

Published : 19 Apr 2022 10:49 IST

అనంతసాగరం: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గురుకుల పాఠశాలలో పాము కలకలం రేపింది. ఈ ఉదయం విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో నాగుపాము గదిలోకి వచ్చింది. పామును చూసిన విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. కొంతమంది విద్యార్థులు ధైర్యం చేసి పామును చంపేశారు. ఈ గురుకులంలో రాత్రిపూట ఉపాధ్యాయులు అందుబాటులో ఉండటం లేదని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు, ఉపాధ్యాయులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని