TRS: హుజూరాబాద్ తెరాసలో ఏం జరుగుతోంది..?
నివురుగప్పిన నిప్పులా.. దాగిన అసంతృప్తి హుజూరాబాద్ నియోజకవర్గంలోని తెరాసలో ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఏక పక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఓ వర్గం నాయకులంతా
ఆరా తీస్తున్న గులాబీ పార్టీ అధిష్ఠానం
ఈనాడు డిజిటల్, కరీంనగర్
వీణవంకలో తెరాస నాయకుల సమావేశం
నివురుగప్పిన నిప్పులా.. దాగిన అసంతృప్తి హుజూరాబాద్ నియోజకవర్గంలోని తెరాసలో ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఏక పక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఓ వర్గం నాయకులంతా రహస్య సమావేశాల నిర్వహణతో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతుంటుంటే.. మరో వర్గం నేతలు కూడా తమకున్న పట్టును చూపించుకునేందుకు రాజధానిలో భేటీలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్న పాడి కౌశిక్రెడ్డికి.. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఉన్న పొరపొచ్చలు ప్రస్తుత పరిణామాలతో క్రమంగా బయటపడుతున్నాయి. ఉప ఎన్నికల తరువాత నుంచే ఈ నియోజవర్గంలో ఈ ఇద్దరు కీలక నేతల వ్యవహారం ఎవరికి వారే అనేలా ఉందనేది సొంతపార్టీ నేతలే పలు సందర్భాల్లో బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ నియోజకవర్గంలోని కీలకమైన ఇల్లందకుంట సీతారామాలయ కమిటీలో ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి కేవలం తనకు అనుకూలంగా ఉన్న నాయకులకే చోటు కల్పించారనే విమర్శలు సొంతపార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి. జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన కొందరు నాయకులు కౌశిక్రెడ్డి ఏక పక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని చేకూరుస్తున్నాయనేలా రహస్య సమావేశాల్ని ఎక్కడికక్కడ నిర్వహించారు. గురువారం కూడా వీణవంక మండలంలో ఓ వర్గం నాయకులు సమావేశమై పార్టీలోని తాజా పరిస్థితిపై చర్చించుకున్నారు. ఇలా సమావేశాల్ని నిర్వహించిన వారంతా గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అనుకూలంగా ఉన్న వర్గమనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇదే సమయంలో కౌశిక్రెడ్డి కూడా తనకు అనుకూలమనుకున్న నాయకులు, ప్రజాప్రతినిధులను హైద్రాబాద్కు పిలిపించుకుని పార్టీ ముఖ్యులతో సమావేశమై తనకున్న మద్దతును కూడా తెలియజేసే ప్రయత్నాన్ని చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో గులాబీపార్టీ పెద్దలు కూడా ఇక్కడ జరుగున్న వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. నాయకుల మధ్య సమన్వయాన్ని కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.