logo

Crime: తనకు తానే గురిపెట్టుకున్నాడు

తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నడిగడ్డతండా సమీపంలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపులో ఈ ఘటన జరిగింది.

Updated : 22 Jul 2021 07:10 IST

సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య


ఠాకూర్‌శంకర్‌

మియాపూర్‌, న్యూస్‌టుడే: తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నడిగడ్డతండా సమీపంలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపులో ఈ ఘటన జరిగింది. మియాపూర్‌ సీీఐ వెంకటేష్‌, ఎస్సై రవికిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ రాష్ట్రం మహిత్నా జిల్లా గొజారియాకు చెందిన ఠాకూర్‌శంకర్‌(28) వరంగల్‌ జిల్లా కాటారంలోని ఆల్ఫా కంపెనీ నుంచి సుమారు రెండున్నర నెలల క్రితం మియాపూర్‌లోని క్యాంపులో విధి నిర్వహణ నిమిత్తం వచ్చాడు. 2017బ్యాచ్‌కు చెందిన శంకర్‌కు 2008లో వివాహమైంది. అతనికి ఇద్దరు పిల్లలు. క్యాంపులో మిగతా సిబ్బంది విధులకు వెళ్లగా బుధవారం సాయంత్రం శంకర్‌ తన దగ్గర ఉన్న తుపాకీతో మెడ దగ్గర కాల్చుకోవడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. కుటుంబ కలహాలు ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు