AP News: ఇసుక రేవులు..ఆగని వసూళ్లు!
అవసరమున్న వారికి సకాలంలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థకు స్వస్తి పలికి, ఆఫ్లైన్లో రేవు దగ్గరకు వాహనంతో వెళ్లి డబ్బులు చెల్లించి ఇసుక తీసుకెళ్లేలా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
పాలసీ మారినా కష్టాలే
వినియోగదారులకు ఎదురుచూపులు
రేవులో ఇసుకను నింపుతున్న ప్రొక్లయినర్
ఆజాద్నగర్(అనంతపురం), న్యూస్టుడే: అవసరమున్న వారికి సకాలంలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థకు స్వస్తి పలికి, ఆఫ్లైన్లో రేవు దగ్గరకు వాహనంతో వెళ్లి డబ్బులు చెల్లించి ఇసుక తీసుకెళ్లేలా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వాహనంతో నేరుగా రీచ్లోకి వెళ్లిన వినియోగదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. రేవు నిర్వాహకులు, స్థానిక అధికార పార్టీ నేతలు, మధ్యవర్తులతో కుమ్మక్కై ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. వీరు చెప్పిన వారికే లోడ్ చేస్తుండటంతో వివాదాలు రేగుతున్నాయి.
14 చోట్ల తవ్వుతున్నా..
నూతన పాలసీ అనుసరించి రాష్ట్రంలో కాంట్రాక్టు దక్కించుకున్న జేపీ వెంచర్స్ సంస్థకు జిల్లా అధికారులు (ఏపీ ఎండీసీ) 17 రేవులు అప్పగించారు. ఇందులో 14 చోట్ల తవ్వకాలు జరుగుతున్నా.. ఏడుచోట్ల మాత్రమే పూర్తి స్థాయిలో ఇసుక అందుతోంది. అన్ని రేవుల్లో తవ్వకాలు జరగక పోవడంతో వినియోగదారులు వరుస కడుతున్నారు. దీనికితోడు స్థానికులు తమ వాహనాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఇసుక అందించాలని పట్టుబడుతున్నారు. ప్రతి రేవులో కనీసం 20 వాహనాలు అందుబాటులో ఉంచుతామని ప్రైవేటు సంస్థ ఇచ్చిన మాట కూడా అమల్లోకి రాలేదు. వినియోగదారులే సమకూర్చుకోవాల్సి వస్తోంది.
మధ్యవర్తులదే హవా
రేవుల్లో మధ్యవర్తులు హల్చల్ చేస్తున్నారు. ఎవరికైనా త్వరగా ఇసుక కావాలంటే వీరిని ప్రసన్నం చేసుకుని, డిమాండ్ మేరకు డబ్బు చెల్లిస్తే వెంటనే వాహనం రేవులోకి వెళ్లి, వీలైనంత వేగంగా ఇసుక నింపుకొని బయటకు వెళ్లిపోతోంది. కనగానపల్లి మండలంలోని కోనేటిపాళ్యం రేవులో ఇటీవల లారీకి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ జేపీ ప్రతినిధులతో ట్రాక్టరు, లారీ డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ స్థానిక అధికార పార్టీ నాయకుడు ఒకరు కొన్ని వాహనాలను లీజుకు తీసుకుని ఇసుకను తరలిస్తున్నారు. కంపెనీ మేనేజరుతో కుమ్మక్కై జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది.
ఒక పర్మిట్పై రెండు ట్రిప్పులు
రేవుల్లో జేపీ వెంచర్ కంపెనీ ప్రతినిధులు పర్మిట్లు అందజేస్తారు. పర్మిట్లలో సదరు వాహనం ఇసుకను డెలివరీ చేయడానికి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధిని అనుమతి ఇస్తున్నారు. ఈ సమయాన్ని పలువురు టిప్పరు యజమానులు ఆసరాగా తీసుకుని పర్మిట్టులో అనుమతించిన సమయంలో రెండుసార్లు ఇసుక తరలిస్తున్నారు. రెండోదఫా నింపుకొనే క్రమంలో కంపెనీ ప్రతినిధులు వాహన యాజమాన్యాలతో అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు పాతర
నిబంధనల ప్రకారం రేవుల్లో ఇసుక తవ్వకాలు సాయంత్రం ఆరు గంటల వరకు జరపాలి. అయితే కోనేటిపాళ్యం రేవు నుంచి జిల్లా కేంద్రంతో పాటు, బెంగళూరు ప్రాంతానికి రాత్రి సమయాల్లో టిప్పర్లలో తరలుతున్నట్లు సమాచారం. ఈ రేవులో రాత్రి వేళల్లో కూడా తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసింది. తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు తన టిప్పర్లలో రేవు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. రేవుల్లో బరువు తూచే యంత్రాలు లేవు. దీంతో ఎంత పరిమాణంలో ఇసుకను తరలిస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది.
గాడిలో పెడతాం: రమణారావు,
డీడీ, గనులు భూగర్భశాఖ
రేవుల్లో ఇసుక నిర్వహణపై నిఘాకు మైనింగ్, రెవెన్యూ, పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారిని అప్రమత్తం చేస్తాం. క్షేత్రస్థాయి పరిస్థితులను మరోసారి పరిశీలిస్తాం. రేవులకు వచ్చిన వినియోగదారులకు వీలైనంత త్వరగా ఇసుక లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు