Crime News: శిల్పాచౌదరి కేసులో ఎవరా ఇద్దరు?
గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్కు చెందిన శిల్పాచౌదరి దంపతుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటిరోజు విచారణలో చూపిన అమాయకత్వమే
నివాసంలో కీలకపత్రాలు స్వాధీనం
బ్యాంకు ఖాతాల పరిశీలన
ముగిసిన పోలీసు కస్టడీ
ఈనాడు, హైదరాబాద్; నార్సింగి, న్యూస్టుడే: గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్కు చెందిన శిల్పాచౌదరి దంపతుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటిరోజు విచారణలో చూపిన అమాయకత్వమే శిల్పాచౌదరి రెండోరోజు ప్రదర్శించింది. పోలీసుల ప్రశ్నలతో భావోద్వేగానికి గురై పలుమార్లు కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం. ఈ దంపతులపై నార్సింగి ఠాణాలో 7 కేసులు నమోదయ్యాయి. రూ.12 కోట్లు మోసపోయినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆమె మాటల్లో నిజమెంత..
శిల్పాచౌదరి రెండ్రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. శుక్ర, శనివారాలు నార్సింగిలోని ఎస్వోటీ(స్పెషల్ ఆపరేషన్ టీమ్) కార్యాలయంలో విచారించారు. వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే రూ.కోట్లు అప్పులు చేశానని, ఊహించని విధంగా పోలీసులు అరెస్ట్ చేయటంతో బుర్రంతా మొద్దుబారిందంటూ మౌనంగా ఉన్నట్టు సమాచారం. ఎవర్నీ మోసం చేయాలనే ఆలోచన లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. ఆధారాలను ముందు పెట్టడంతో క్రమంగా తాను తీసుకున్న డబ్బును ఆసుపత్రి నిర్మాణానికి ఖర్చు చేశానని చెప్పుకొచ్చారు. ఇద్దరికి పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చినట్టు విచారణలో కొత్త పేర్లు తెరమీదకు తెచ్చారు. వారిలో ఒకరు శంకరంపల్లికి చెందిన రాధిక అని ఆమెకు రూ.6 కోట్లు ఇచ్చానంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గండిపేటలోని శిల్ప ఇంట్లో శనివారం పోలీసులు సోదాలు చేసి బ్యాంకు ఖాతా పుస్తకాలు, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ప్రైవేటు బ్యాంకులో ఖాతాలను పరిశీలించారు. నాలుగు బ్యాంకు ఖాతాల్లో రెండింట్లో ఎటువంటి నగదు లేదని గుర్తించారు. మరో రెండు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. రాధిక శనివారం మాదాపూర్ ఏసీపీని కలసి తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని కేవలం ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు.
ఆ ఇద్దరికీ నోటీసులు జారీ
ఆమె వెల్లడించిన ఇద్దరికీ సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ ఇద్దరూ వ్యాపార భాగస్వాములా! నిజంగానే డబ్బు తీసుకున్నారా! అనే వివరాలు దర్యాప్తులో బయటపడతాయని అభిప్రాయ పడుతున్నారు. రెండ్రోజుల కస్టడీలో ఆమె నుంచి పోలీసులు పూర్తివివరాలు రాబట్ట లేకపోయారు. వివరాలు రాబట్టేందుకు మరోసారి ఆమెను కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు